News January 1, 2025

కామారెడ్డి: ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చైతన్య రెడ్డి

image

కామారెడ్డి ఏఎస్పీగా చైతన్య రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం ఆమెను కామారెడ్డి ఏఎస్పీగా నియమించింది. ఈ మేరకు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆమె సూచించారు.

Similar News

News October 14, 2025

నిజామాబాద్: సవాలుగా మారిన బంగారం చోరీ కేసు

image

ఇందల్వాయి మండలం లింగాపూర్‌లో దుర్గాదేవి నవరాత్రుల సమయంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన అపర్ణ పూజా కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చొరబడి 8 తులాల బంగారం, 25 తులాల వెండిని దొంగలు అపహరించారు. సోమవారం బాధితురాలు సీపీ సాయి చైతన్యకు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సందీప్ కేసు నమోదు చేశారు.

News October 14, 2025

నిజామాబాద్: బాలికలను ఆటపట్టించిన ఇద్దరి అరెస్టు

image

నిజామాబాద్‌లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కోటగల్లి వద్ద సోమవారం బాలికలను ఫాలో చేస్తూ అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఆకతాయిలను షీ టీం పట్టుకొని తదుపరి చర్యలకు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. బాలికలను, మహిళలను ఎవరైనా వేధిస్తే షీ టీంకు తెలపాలన్నారు.

News October 13, 2025

NZB: బీజేపీ పోరాట ఫలితంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు: దినేష్ కులాచారి

image

బీజేపీ పోరాట ఫలితంగానే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రం ఇచ్చామని గుర్తు చేశారు. స్పందించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.