News January 27, 2025

కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలో మృతదేహం లభ్యం

image

కామారెడ్డిలో కలెక్టరేట్ ఎదుట ఉన్న జాతీయ రహదారి పక్కన ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

Similar News

News December 17, 2025

దేవదేవుని లక్షణాలు – ఒకే శ్లోకంలో

image

వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః|
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః||
అన్నీ తెలిసినవాడు, సకల విద్యలకు మూలమైనవాడు, నిత్యం జ్ఞానరూపంలో ఉండేవాడు, దుష్టులను సంహరించి ధర్మాన్ని రక్షించేవాడు, తత్త్వజ్ఞానానికి అధిపతి, లక్ష్మీదేవికి భర్త, మధురమైనవాడు, ఇంద్రియాలకు అందనివాడు, మాయలన్నిటికీ కారణభూతుడు, సృష్టి కార్యాలు చేయువాడు, అనంత శక్తి, గొప్ప సంపద కలవాడు.. ఆయనే శ్రీమహావిష్ణువు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News December 17, 2025

ఎల్లారెడ్డిపేట: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో ఫేజ్ ఎన్నికలలో భాగంగా ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బుధవారం పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, అల్మాస్ పూర్, గొల్లపల్లి, వీర్నపల్లి మండలంలోని కంచర్ల, వీర్నపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రంలో ఆవరణ, కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.

News December 17, 2025

కామారెడ్డి జిల్లాలో మూడో విడత తొలి ఫలితం

image

నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంప్ సర్పంచ్ స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. అంకోల్ క్యాంప్ సర్పంచ్‌గా అనిత-రాములు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అనితకు 209 మెజారిటీ వచ్చింది. తన సమీప ప్రత్యర్థి సావిత్రికి 36 ఓట్లు వచ్చాయి. 3 ఓట్లు చెల్లలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.