News January 27, 2025

కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలో మృతదేహం లభ్యం

image

కామారెడ్డిలో కలెక్టరేట్ ఎదుట ఉన్న జాతీయ రహదారి పక్కన ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

Similar News

News December 17, 2025

సిద్దిపేట జిల్లాలో 9AM@ 24.35% పోలింగ్

image

సిద్దిపేట జిల్లాలో కొనసాగుతున్న మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటల వరకు 24.35% నమోదైంది. అక్కన్నపేట-29.04%, చేర్యాల-24.05%, ధూల్మిట్ట-23.23%, హుస్నాబాద్-19.59%, కోహెడ-21.79%, కొమురవెల్లి-28.66%, కొండపాక-25.12%, కుకునూరుపల్లి-30.33%, మద్దూరు-17.02% పోలింగ్ నమోదైనట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.

News December 17, 2025

విమర్శలను ఎదుర్కోవడం నేర్చుకోండి

image

తమపై విమర్శలు వస్తే అమ్మాయిలు కుంగిపోతూ ఉంటారు. అయితే వాటిని సానుకూలంగా చూడటం అలవాటు చేసుకోవాలంటున్నారు సైకాలజిస్టులు. అప్పుడే విమర్శల నుంచి పాఠాలు నేర్చుకొని మరింత ఎదిగే అవకాశం లభిస్తుందంటున్నారు. ‘విమర్శలను మనసుకు తీసుకుంటే భావోద్వేగాలు తీవ్రమై, మానసిక క్షోభ అనుభవించాల్సి ఉంటుంది. విమర్శలకు, భావోద్వేగాలకు ముడిపెట్టకూడదు. సానుకూల విమర్శలను స్వీకరించి వృద్ధికి బాటగా మలచుకోవాలి’ అని చెబుతున్నారు.

News December 17, 2025

ఉత్కంఠ.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ తీర్పు నేడే!

image

TG: ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ నేడు తీర్పు ప్రకటించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల అడ్వకేట్లకు ఆయన నోటీసులు పంపారు. 3.30PMకు స్పీకర్‌ ఆఫీసుకు BRS, ఫిరాయింపు ఎమ్మెల్యేల అడ్వకేట్లు రానున్నారు. అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్‌, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్‌, గూడెం మహిపాల్‌రెడ్డిపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.