News January 28, 2025
కామారెడ్డి: కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరాలి: కలెక్టర్

కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం, స్పోర్ట్స్డే సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఆ దిశగా నిరంతరం సాధన చేయాలని సూచించారు. క్రమశిక్షణతో ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. దాతల సహకారంతో కళాశాలకు అవసరమైనవి సమకూర్చుకోవాలని సూచించారు.
Similar News
News November 27, 2025
ఇతిహాసాలు క్విజ్ – 79 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: శ్రీకాళహస్తి క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది?
సమాధానం: శివ భక్తులైన మూడు జీవులు శివుడి కోసం తమ ప్రాణాలను అర్పించి మోక్షం పొందాయి. అవే.. శ్రీ (సాలెపురుగు), కాళ (పాము), హస్తి (ఏనుగు). ఈ 3 జీవులు శివుడిని అత్యంత భక్తితో పూజించి, స్వామి అనుగ్రహం పొంది అక్కడే లీనమయ్యాయి. వీటి పేర్ల కలయికతోనే ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు స్థిరపడింది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 27, 2025
VKB: ‘ఎన్నికల విధుల్లో సక్రమంగా విధులు నిర్వహించాలి’

గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తు ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండ పారదర్శకంగా సజావుగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకురాలు షేక్ యాస్మిన్ భాష అన్నారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో ఎన్నికల నిర్వహణపై పరిశీలకురాలు కలెక్టర్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దన్నారు.
News November 27, 2025
జనగామ కలెక్టరేట్లో మీడియా సెంటర్ ప్రారంభం

జనగామ జిల్లా కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీడియా సెంటర్ను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్తో కలిసి ఎలక్షన్స్ జనరల్ అబ్జర్వర్ కె.నిఖిల ఈరోజు ప్రారంభించారు. అనంతరం జిల్లా ఫొటో గ్యాలరీని ఆసక్తిగా తిలకించారు. గతంలో జిల్లా కలెక్టర్గా తాను అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేయాలని నోడల్ అధికారులకు సూచించారు. డీపీఆర్ఓ బండి పల్లవి పాల్గొన్నారు.


