News March 5, 2025
కామారెడ్డి: కారు ఢీకొని మహిళ మృతి

కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో బుధవారం సాయంత్రం ఓ మహిళను కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ అతివేగంగా నడిపి చిన్న మల్లారెడ్డి గ్రామంలో మహిళ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News December 10, 2025
మా దేశం పేరు సంస్కృతం నుంచే వచ్చింది: సింగపూర్ మాజీ డిప్యూటీ PM

సింగపూర్ లేదా సింగపురా అనే పేరు సంస్కృతం నుంచి ఉద్భవించిందని ఆ దేశ మాజీ ఉప ప్రధాని తియో చీ హియాన్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన అటల్ బిహారీ వాజ్పేయి మెమోరియల్ లెక్చర్లో ఆయన మాట్లాడుతూ భారత్-సింగపూర్ చారిత్రక అనుబంధం గురించి వెల్లడించారు. 1867 వరకు కోల్కతా నుంచి సింగపూర్ పరిపాలన జరిగిందని గుర్తుచేశారు. తమ దేశ ఆర్థిక, సాంస్కృతిక నిర్మాణంలో భారతీయులు కీలకపాత్ర పోషించారని కొనియాడారు.
News December 10, 2025
బొదులూరు పీహెచ్సిని ఆకస్మిక తనిఖీలు చేసిన ఐటీడీఏ పీవో

మారేడుమిల్లి మండలంలోని బొదులూరు పీహెచ్సిని రంపచోడవరం ఐటీడీఏ పీఓ స్మరన్ రాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్యం అందుతుందా, వైద్య పరీక్షలు చేస్తున్నారా అనే వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి పంపించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
News December 10, 2025
కడప: టెట్ పరీక్ష.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి

కడప జిల్లాలో ఇవాళ్టి నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 15,082 మందికి 8 పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏవైనా బ్బందులు ఉంటే 9959322209, 9849900614, 9948121966 నంబర్లకు సంప్రదించాలని DEO శంషుద్దీన్ సూచించారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారు.


