News March 5, 2025
కామారెడ్డి: కారు ఢీకొని మహిళ మృతి

కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో బుధవారం సాయంత్రం ఓ మహిళను కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ అతివేగంగా నడిపి చిన్న మల్లారెడ్డి గ్రామంలో మహిళ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News March 15, 2025
NZB: ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తోంది: కవిత

అసెంబ్లీలో మా సభ్యులను సస్పెండ్ చేయడం.. మండలిలో మా మీద ఆన్ పార్లమెంటరి వర్డ్స్ వాడటం చుస్తే ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం అవుతోందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం మండలి మీడియా పాయింట్లో ఆమె మాట్లాడారు. శాసనమండలిలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే కక్ష సాధిస్తున్నారన్నారు.
News March 15, 2025
సిరిసిల్ల: కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

అక్రమ బెట్టింగ్ యాప్స్లలో బెట్టింగ్కి పాల్పడిన, ఆన్లైన్ గేమింగ్ యాప్లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సహించిన కఠిన చర్యలు తప్పవని సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమతో యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్లకు బానిసలుగా మారి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారని తెలిపారు.
News March 15, 2025
NGKL: శ్రీశైలం హైవేపై వాహనాల రాకపోకలపై సర్వే.!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో 7,668 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయనుంది. రోజుకు ఈ రోడ్డుపై సగటున 7,181 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన్ననూరు చెక్పోస్ట్ వరకు 6,880, వట్వర్లపల్లి ఈగలపెంట మధ్య 7,005 వాహనాలు తిరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోడ్డుపై శ్రీశైలానికి, ఏపీకి ఎన్ని వాహనాలు వెళుతున్నాయనే వివరాలను సేకరిస్తున్నారు.