News January 9, 2025
కామారెడ్డి: కొడుకును కాపాడటానికి వచ్చి తండ్రి మృతి
కొడుకును కాపాడటానికి వెళ్లిన తండ్రి రైలు ప్రమాదంలో మృతి చెందిన ఘటన రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. కామారెడ్డి జిల్లా బాగిర్తి పల్లికి చెందిన పెద్ద నర్సింలు కుమారుడు మంగళవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో అతడిని వెతుక్కుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో నర్సింలును రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 14, 2025
NZB: పసుపు రైతుల తరఫున PMకు ధన్యవాదాలు: MP
పసుపు రైతుల పక్షాన ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. వర్చువల్గా మంగళవారం పసుపుబోర్డు ప్రారంభం సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణలో పసుపు బోర్డు కోసం నాలుగు దశబ్దాలుగా రైతులు పోరాటం చేస్తున్నారన్నారు. ప్రధాని నిజామాబాద్ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పసుపు పండించే రైతులకు మేలు కలుగుతుందన్నారు.
News January 14, 2025
నవీపేట్: సంక్రాంతి వేడుకల్లో అపశృతి
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. చైనా మంజాతో ఓ యువకుడి గొంతుతో పాటు రెండు వేళ్లు తెగాయి. దీంతో వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చైనా మాంజా వాడొద్దని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నా దుకాణదారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా చైనా మాంజాను వాడకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News January 14, 2025
NZB: గల్ఫ్లో యాక్సిడెంట్.. రూ.55 లక్షల పరిహారం
గల్ఫ్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం జ్యాగిర్యాల గ్రామానికి చెందిన గద్దల రాజు కుటుంబానికి రూ.55 లక్షల పరిహారం యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినిస్సేరి సోమవారం అందజేశారు. 2022లో గల్ఫ్లో రాజు రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగి మృతి చెందారు. యాబ్ లీగల్ సర్వీసెస్ ద్వారా పరిహారం వచ్చింది. షేక్ ఆల్ అజీజ్, రవుఫ్, మునీత్ తదితరులు పాల్గొన్నారు.