News January 18, 2025
కామారెడ్డి: గెస్ట్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు, చరిత్ర సబ్జెక్టులను బోధించేందుకు గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ విజయ్ కుమార్ తెలిపారు. ఈనెల 18 నుంచి 20 వరకు కాలేజీలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 22న ఉదయం ఇంటర్వ్యూ ఉంటుందని స్పష్టం చేశారు.
Similar News
News October 15, 2025
రోడ్డు ప్రమాదం.. కుటుంబంలో నలుగురు మృతి

TG: కామారెడ్డి(D) భిక్కనూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు తాత, తల్లి, పిల్లలను కబళించింది. ఖమ్మం(D) ముస్తికుంటకు చెందిన వీరు స్కూటీపై వెళ్తుండగా రాంగ్రూట్లో వచ్చిన టిప్పర్ బలంగా ఢీకొట్టింది. తల్లి, ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ తాత, రెండేళ్ల పాపను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.
News October 15, 2025
సౌతాఫ్రికాపై పాక్ విజయం

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ ఇన్సింగ్సులో పాక్ 378 పరుగులు చేయగా సౌతాఫ్రికా 269 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్సులో పాక్ 167 రన్స్కే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా పాక్ బౌలర్ల ధాటికి 183 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్ నొమన్ అలీ 10 వికెట్లతో సత్తా చాటారు. SA బౌలర్ సెనురన్ ముత్తుసామి 11 వికెట్లు తీశారు.
News October 15, 2025
ఐడియా అదిరింది కానీ.. సాధ్యమేనా!

దేశవ్యాప్తంగా వెండి ధరల్లో భారీ తేడాలున్నాయి. అహ్మదాబాద్లో కేజీ వెండి రూ.1,90,000 ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో అది రూ.2,07,000 ఉంది. అంటే ఏకంగా రూ.17,000 వ్యత్యాసం ఉందన్నమాట. దీనిపై ఒక నెటిజన్ ‘అహ్మదాబాద్లో కొని ఇక్కడ అమ్మితే ఖర్చులు, ట్యాక్సులు పోనూ రూ.14 వేలు మిగులుతాయి’ అని పోస్ట్ చేయగా తెగ వైరలవుతోంది. అయితే ఇది రియాల్టీలో సాధ్యం కాదని, లీగల్ సమస్యలొస్తాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.