News April 17, 2024
కామారెడ్డి: గ్రూప్1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా జూన్ 9 న నిర్వహించే గ్రూప్-1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించుటకు అధికారులు ముందస్తు ప్రణాళికతో సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశమందిరంలో టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్-1 పరీక్షల నిర్వహణ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరపాలన్నారు.
Similar News
News February 1, 2025
NZB:14.5 తులాల బంగారం చోరీ
సిరికొండ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన సత్తయ్య ఇంట్లో 14.5 తులాల బంగారం గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని సిరికొండ ఏఎస్ఐ బాల్ సింగ్ తెలిపారు. ఏఎస్ఐ వివరాల ప్రకారం.. సత్తయ్య శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. బీరువాను చూడగా బంగారం పోయిందని బాధితుడు వాపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
News February 1, 2025
నవీపేట్: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
నవీపేట్ మండలం ఎంచ గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ వినయ్ కుమార్ వివరాల ప్రకారం.. రావుల పెద్దయ్యకు ఇద్దరు భార్యలు ఉన్నారు. నవీపేట్ సుభాష్ నగర్కి చెందిన రెండో భార్య సవిత ప్రతిరోజూ గొడవ పడుతుండేది. ఆమె బంధువులు వచ్చి బెదిరించడంతో గొడవ ఏర్పడింది. దీంతో పెద్దయ్య ఆవేశంలో శుక్రవారం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తమ్ముడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 1, 2025
NZB: ఫేక్ యాప్తో మోసం.. ఇద్దరి అరెస్ట్
ఫేక్ యాప్లో ఆఫర్ల పేరిట అమాయకులను మోసం చేస్తున్న షేక్ అమిర్, సయ్యద్ ఇమ్రాన్ అలీ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి వివరాలు వెల్లడించారు. MGI యాప్ పేరుతో దాదాపుగా 12 మంది బాధితుల నుంచి రూ.2.40లక్షల నగదును కాజేశారని పేర్కొన్నారు. ఇలాంటి యాప్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేసు ఛేదనకు కృషి చేసిన పోలీసు అధికారులను ACP అభినందించారు.