News February 26, 2026
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 98.16% హాజరు

కామారెడ్డి జిల్లా కేంద్రం వ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 7,878 మంది విద్యార్థులు నమోదు కాగా, అందులో 7,733 మంది హాజరై 145 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా హాజరు శాతం 98.16గా నమోదైంది. పరీక్షా కేంద్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
Similar News
News April 15, 2026
ములుగు: యాసంగి వరి ధాన్యం నాణ్యత ప్రమాణాలు ఇవే!

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నాణ్యత ప్రమాణాలను (FAQ) వ్యవసాయ శాఖ అధికారులు విడుదల చేశారు. ధాన్యంలో తేమ 17 శాతం మించరాదని, వ్యర్థ పదార్థాలు 1%, రంగు మారిన మొలకెత్తిన గింజలు 4%, పక్వానికి రాని గింజలు 3%, బెరుకు గింజలు 6% మించొద్దని సూచించారు. సాధారణ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,369, గ్రేడ్ ఏ రకం ధాన్యానికి రూ.2,389 మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించారు.
News April 15, 2026
SKLM: ఇద్దరిని చంపిన వ్యక్తి సూసైడ్

పలాస మండలం మహదేవపురానికి చెందిన రామారావు(45) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది జరిగిన జంట హత్యల కేసులో నిందితుడైన ఇతడు, నెల కిందటే బెయిల్పై బయటకు వచ్చాడు. బుధవారంతో గడువు ముగియనుండగా, పూచీకత్తు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జీవిత ఖైదు తప్పదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఐ ఆర్వీఆర్ నాయుడు తెలిపారు.
News April 15, 2026
న్యూడ్ వీడియో కాల్స్ రాకెట్.. అమాయక మహిళలే టార్గెట్?

AP: గుంటూరు(D) తెనాలిలో న్యూడ్ వీడియో కాల్స్ రాకెట్ కలకలం రేపుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు మహిళలను ఇటీవల అరెస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమార్కులు డబ్బు ఆశచూపి 80-100 మంది అమాయక మహిళలను ఈ రొంపిలోకి దింపినట్లు సమాచారం. వారికి ఒక్కో ఆన్లైన్ కాల్కు రూ.500-1,000 ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి అట్రాక్ట్ అయ్యి వచ్చే వ్యక్తుల నుంచి భారీగా వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


