News April 2, 2025
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

కామారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం మద్నూర్ మండలం సోమూర్లో 39.7°C ఉష్ణోగ్రత నమోదైంది. సర్వపూర్లో 39.2°C, పెద్ద కొడప్గల్ 39.1°C, మేనూర్, గాంధారిలో 39.0°C, జుక్కల్లో 38.9°C, నిజాంసాగర్లోని మాక్డూంపూర్, నస్రుల్లాబాద్ 38.8°C, బిచ్కుంద 38.7°C బీర్కూర్ 37.8 °C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News November 17, 2025
డిసెంబర్ రెండో వారంలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్?

స్థానిక సంస్థల ఎన్నికలకు TG ప్రభుత్వం సిద్ధమవుతోంది. DEC రెండో వారంలో షెడ్యూల్ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తొలుత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి, అనంతరం MPTC, ZPTC ఎలక్షన్స్కు వెళ్లాలని సర్కార్ యోచిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టపరంగా ఆటంకం ఏర్పడటంతో పార్టీ పరంగానే రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది.
News November 17, 2025
డిసెంబర్ రెండో వారంలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్?

స్థానిక సంస్థల ఎన్నికలకు TG ప్రభుత్వం సిద్ధమవుతోంది. DEC రెండో వారంలో షెడ్యూల్ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తొలుత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి, అనంతరం MPTC, ZPTC ఎలక్షన్స్కు వెళ్లాలని సర్కార్ యోచిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టపరంగా ఆటంకం ఏర్పడటంతో పార్టీ పరంగానే రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది.
News November 17, 2025
గ్రంథాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత: కలెక్టర్ ప్రావీణ్య

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పాఠకులకు ఎలాంటి పుస్తకాలు కావాలన్నా వెంటనే అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి వసుంధర పాల్గొన్నారు.


