News January 21, 2025
కామారెడ్డి జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతుంది. ప్రజలు చలి ప్రభావంతో బయటకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా గాంధారి 10.8, మేనూరు 11.2, రామలక్ష్మణపల్లి 11.3, సర్వాపూర్ 11.8, ఇసాయిపేట్ 12.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యయి.
Similar News
News February 8, 2025
కేసీఆర్ను కలిసిన వారంతా ఓటమి: కాంగ్రెస్

ఢిల్లీలో బీజేపీ గెలవడంతో రాహుల్ గాంధీని అభినందిస్తూ KTR చేసిన సెటైరికల్ ట్వీట్కు కాంగ్రెస్ నేతలు కౌంటరిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ BRS చీఫ్ KCRను కలవడం వల్లే ఓడిపోయారని ట్వీట్స్ చేస్తున్నారు. ‘మనం చెయ్యి కలిపితే మామూలుగా లేదుగా. YS జగన్, నవీన్ పట్నాయక్, థాక్రే, కేజ్రీవాల్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఢిల్లీలో కాంగ్రెస్ మరోసారి సున్నా సీట్లు గెలిచిందని BRS శ్రేణులూ రీకౌంటరిస్తున్నాయి.
News February 8, 2025
బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలి: KMR కలెక్టర్

మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్ లో పీఓ, ఏపీఓ, ఓపీఓలకు మొదటి దఫా శిక్షణా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోసం కేటాయించిన సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు.
News February 8, 2025
ఇవాళ ‘పుష్ప-2’ థాంక్యూ మీట్

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప-2’ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఓటీటీలోకి వచ్చేసిన ఈ మూవీ టాప్ ప్లేస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ఇవాళ ‘థాంక్యూ మీట్’ నిర్వహించనున్నట్లు మూవీ యూనిట్ పోస్ట్ చేసింది. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.