News March 15, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి TOP NEWS

image

*పరీక్షలు ప్రశాంతంగా రాయండి:కలెక్టర్
*పిట్లం: అంగన్వాడీల నిర్వహణ సక్రమంగా ఉండాలి:కలెక్టర్
*ఇంటర్ పరీక్షల్లో 137 మంది గైర్హాజరు
*ఆ నమ్మకాన్ని మరింత పెంచేలా కృషి చేయాలి: SP
*మహిళలకు అండగా ‘భరోసా’ కేంద్రం: SP
*సిద్ధ రామేశ్వర స్వామీ బ్రహ్మోత్సవాలు షురూ
*అప్పుల బాధతో యువకుడు సూసైడ్
*వసతి గృహాన్ని తనిఖీ చేసిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

Similar News

News November 19, 2025

రాష్ట్రంలో 324 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

image

TG: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 324 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈవోలకు దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈవోలు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఆలయాల వారీగా రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

News November 19, 2025

హిందూ మహిళలకు సుప్రీంకోర్టు కీలక సూచన

image

మరణానంతరం తన ఆస్తిని ఎవరికి పంచాలో హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. మహిళ చనిపోయాక ఆస్తుల విషయంలో పుట్టింటి, అత్తింటి వారికి వివాదాలు వస్తున్నాయని పేర్కొంది. వారసత్వ చట్టంలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ ఒక మహిళ పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టం ప్రకారం పిల్లలు లేని వితంతువు చనిపోతే ఆమె ఆస్తులు భర్త ఫ్యామిలీకి చెందుతాయి.

News November 19, 2025

బెల్లంపల్లి: ఈపీ ఆపరేటర్ల పదోన్నతుల కోసం పరీక్షలు

image

బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓపెన్ కాస్ట్ వద్ద బెల్లంపల్లి రీజియన్ (శ్రీరాంపూర్,బెల్లంపల్లి, మందమర్రి) పరిధిలో ఈపీ ఆపరేటర్ పదోన్నతుల కోసం బుధవారం అధికారులు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. D గ్రేడ్ నుంచి Cగ్రేడ్ పదోన్నతి కోసం 9మంది, Cగ్రేడ్ నుంచి Bగ్రేడ్ పదోన్నతి కోసం 38 మంది ఈపీ ఆపరేటర్లు పరీక్షలు హాజరయ్యారు. అధికారులు రాజమల్లు, అనిల్ కుమార్, వీరన్న, శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.