News March 16, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం రోజున నిజాంసాగర్‌లోని హాసన్‌పల్లి, పాల్వంచలోని ఎల్పుగొండ, 41.8°C ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే డోంగ్లి, జుక్కల్ 41.4, మద్నూర్‌లోని మేనూర్ 41.2, పిట్లం 41.1, మద్నూర్‌లోని సోమూరు, నాగిరెడ్డిపెట్, ఎల్లారెడ్డిలోని మచపూర్‌లో 40.9,బిచ్కుంద, దోమకొండ 40.7, కామారెడ్డిలోని కలక్టరేట్‌లో, గాంధారి, సర్వపూర్ 40.5°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News November 7, 2025

పెరిగిన ఓటింగ్.. మార్పుకు సంకేతమా..?

image

బిహార్ తొలిదశ ఎన్నికల్లో 20 ఏళ్లలో తొలిసారి 64.66% ఓటింగ్ శాతం పెరగడంపై పార్టీల్లో చర్చ జరుగుతోంది. భారీ ఓటింగ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే సంకేతమని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. అధికారపక్షంపై అసహనం, ఆగ్రహం అధికంగా ఉంటే ఓటర్లూ అదేస్థాయిలో పోలింగ్ స్టేషన్లకు వస్తారన్నారు. 1998సం.లో (MP ఎన్నికలు) తొలిసారి 64%, 2000లో 62% ఓటింగ్ నమోదవగా అప్పుడు అధికార బదిలీ జరిగింది. ఈసారి ఇది రిపీటవుతుందా?

News November 7, 2025

పేరు గొప్ప.. వికారాబాద్ దిబ్బా.!

image

‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా వికారాబాద్ జిల్లా పరిస్థితి మారింది. VKB జిల్లాలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, మరెన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నా జిల్లాను పాలకులు అభివృద్ధి చేసిన పాపాన పోలేదని ప్రజలు వాపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి లాంటి ఉద్దండ రాజకీయ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడం గమనర్హం.

News November 7, 2025

నెల్లూరు: కాంట్రాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు

image

నెల్లూరు జిల్లా ఉదయగిరి(M) గంగిరెడ్డిపల్లి జగనన్న లేఅవుట్ కాంట్రాక్టర్లపై లబ్ధిదారులతో కలిసి హౌసింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్లు నిర్మించకుండా కాంట్రాక్టర్లు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, దేవండ్ల పిచ్చయ్య నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మీ ఏరియాలోనూ కాంట్రాక్టర్లు ఇలాగే చేశారా?