News March 12, 2025

కామారెడ్డి జిల్లాలో నేడు ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం మద్నూరులోని సోమూర్లో 37.5°C ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే పిట్లంలో 37.3, మద్నూరులోని మెనూర్లో 37.2, పెద్ద కొడప్గాల్ 37.0, బాన్సువాడలోని కొల్లూరులో 36.8, బిచ్కుంద 36.6, జుక్కల్, నిజాంసాగర్లోని మక్దూంపూర్, పాల్వంచలోని ఎల్పుగొండలో 36.3°C గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News October 26, 2025

కవిత ఆరోపణలు.. బీఆర్ఎస్ నేతలు స్పందిస్తారా?

image

నిజామాబాద్‌లో జాగృతి జనంబాట కార్యక్రమంలో కవిత సంచలన ఆరోపణలు చేశారు. తన ఓటమికే <<18110074>>BRS ఎమ్మెల్యేలే<<>> కారణమని ఆరోపించారు. అంతేగాక తన ఓటమికి కొందరు <<18102361>>కుట్ర పన్నరాని<<>> పేర్కొన్నారు. ఇంతకి ఎవరా ఎమ్మెల్యేలు అనే చర్చ జిల్లాలో మెుదలైంది. పార్టీకి వ్యతిరేకంగా ఏం చేయకున్నా BRS నుంచి తనను బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కవిత వ్యాఖ్యలపై BRS నేతలు స్పందిస్తారా? మౌనాన్ని పాటిస్తారా వేచి చూడాలి.

News October 26, 2025

మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ టిప్స్ పాటించండి

image

అందంగా కనిపించాలని ముఖంపై పెట్టే శ్రద్ధ చాలామంది కాళ్లు, చేతులపై పెట్టరు. దీంతో మోచేతులు, మోకాళ్లు నల్లగా మారతాయి. దీన్ని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. రోజూ కలబంద గుజ్జును మోచేతులు, కాళ్లకి రాస్తుంటే నలుపుదనం తగ్గుతుంది. స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో కాస్త పంచదార వేసి దాంతో చేతులు, కాళ్లని స్క్రబ్ చేసి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి చర్మానికి రాసినా సమస్య తగ్గుతుంది.

News October 26, 2025

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి: యూటీఎఫ్‌

image

పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జ్ఞానమంజరి డిమాండ్‌ చేశారు. సంగారెడ్డిలోని కేకే భవన్‌లో ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి తరగతికి ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి సాయిలు తదితరులు పాల్గొన్నారు.