News September 21, 2024
కామారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దోమకొండ అంబర్పేట్కి చెందిన వీణ (23), కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి (24) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోరని భావించిన సాయి ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వీణ సైతం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News September 21, 2024
గాంధారి: ఇంట్లో భారీ చోరీ
గాంధారి మండలంలోని కమ్మరిగల్లీకి చెందిన కుమ్మరి రంజిత్ ఇంట్లో చోరీ జరిగింది. రంజిత్ కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి గురువారం వేములవాడకు వెళ్లి శుక్రవారం వచ్చారు. కాగా అప్పటికి ఇంటి తలుపులు తీసి ఉన్నట్లు, బీరువాలోని 7 తులాల బంగారం, నగదు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపాడు. ఈ మేరకు సీఐ సంతోష్ కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
News September 21, 2024
మోపాల్: పేదరికం జయించి ఎస్సై ఉద్యోగం సాధించాడు
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్కు చెందిన లచ్చిరాం- నిర్మల దంపతుల కుమారుడు మూడు అజయ్ పేదరికం జయించి ఎస్సై ఉద్యోగం సాధించాడు. వారి తల్లిదండ్రులు వారికున్న రెండు ఎకరాల భూమిని సాగు చేస్తూ అజయ్ను HYDలో ఉన్నత చదువులు చదివించారు. మొదటగా అజయ్ రైల్వేలో ఉద్యోగం సాధించాడు. ఆ ఉద్యోగం చేస్తూనే ఎస్సై జాబ్కు ప్రిపేర్ అయ్యాడు. ఎస్సై ఉద్యోగం సాధించిన అజయ్ని గ్రామస్థులు అభినందించారు
News September 21, 2024
ఎల్లారెడ్డి: హాస్టల్లో విద్యార్థులతో కలిసి నిద్రించిన జిల్లా కలెక్టర్
ఎల్లారెడ్డి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల వసతి గృహంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం రాత్రి విద్యార్థులతో కలిసి నిద్రించారు. అంతకు ముందు ఆయన విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ.. అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉన్నాయా? భోజనం ఎలా ఉంటున్నది? మౌళిక సదుపాయాలు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.