News March 31, 2025

కామారెడ్డి జిల్లాలో మండుతున్న ఎండలు

image

కామారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. బిచ్కుంద మండలంలో అత్యధికంగా 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత, నస్రుల్లాబాద్ రామారెడ్డి మద్నూర్‌లో 40.9, కామారెడ్డి నిజాంసాగర్, గాంధారి మండలాల్లో 40.7, దోమకొండ, పాల్వంచ మండలాల్లో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.

Similar News

News January 3, 2026

MBNR: SSC, INTER ఫీజు చెల్లించండి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఓపెన్ SSC, INTERలో చేరే విద్యార్థులు ఎగ్జామ్ ఫీ చెల్లించాలని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్(TOSS) కో-ఆర్డినేటర్ శివయ్య తెలిపారు. ఈ నెల( ఫైన్ లేకుండా) 5లోగా.. ఫైన్‌తో 16లోగా ఎగ్జామ్ ఫీ ఆన్లైన్‌లో చెల్లించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు www.telanganaopenschool.org వెబ్ సైట్‌లో సందర్శించాలన్నారు.

News January 3, 2026

కేసీఆర్ సంతకమే తెలంగాణ పాలిట మరణ శాసనమైంది: రేవంత్

image

TG: కృష్ణా బేసిన్‌లో రాష్ట్ర ప్రాజెక్టులకు 490 టీఎంసీల కేటాయింపు ఉండేదని అసెంబ్లీలో CM రేవంత్ తెలిపారు. ‘రాష్ట్రం విడిపోయే ముందు కిరణ్ కుమార్ ప్రభుత్వం 299 టీఎంసీలే అని పేర్కొంది. ఆనాడు ఈఎన్‌సీగా ఉన్న మురళీధర్‌ రావు కూడా 299 టీఎంసీలే అని తప్పుడు నివేదిక ఇచ్చారు. 490 టీఎంసీల కోసం పోరాడాల్సిన KCR 299 టీఎంసీలకు అంగీకరిస్తూ సంతకం చేశారు. ఇదే తెలంగాణ పాలిట మరణశాసనంగా మారింది’ అని మండిపడ్డారు.

News January 3, 2026

HNK: లారీ ఢీకొని గీత కార్మికుడి దుర్మరణం

image

ములుగు రోడ్డులోని కొత్తపేట ఎన్‌ఎస్‌ఆర్‌ ఆసుపత్రి వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరెపల్లికి చెందిన గీత కార్మికుడు గౌని అనిల్‌కుమార్ గౌడ్(48) మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ఆయన్ను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆరెపల్లి రింగ్‌ రోడ్డు వద్ద సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.