News January 19, 2025
కామారెడ్డి జిల్లాలో మరింత తగ్గుదలకు ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జిల్లాలో అత్యల్పంగా గాంధారి 11.6,జుక్కల్ 11.7, మేనూర్ 11.9, సర్వాపూర్ 12.5, డోంగ్లి, బీబీ పేట్లో 12.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. చలి ప్రభావం ఎక్కువ అవుతుంది నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News November 27, 2025
SRCL: మహిళల ఓట్లపైనే అందరి ఆశలు..!

GP ఎన్నికల్లో గెలుపు కోసం CONG, BRS మహిళలపైనే ఆశలు పెట్టుకున్నాయి. జిల్లాలో 170772 మంది పురుషులు, 182559 మంది మహిళా ఓటర్లున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లు 11787 అధికంగా ఉన్నాయి. దీంతో మహిళలను ప్రసన్నం చేసుకోవడానికి ఇరు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, చీరలు, ఫ్రీ RTC ప్రయాణం వంటి పథకాల పేరిట CONG ఓట్లు అడగనుండగా, ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఓట్లు రాబట్టాలని BRS చూస్తోంది.
News November 27, 2025
సిరిసిల్లలో సర్పంచుల ‘ఏకగ్రీవాల పర్వం’..!

సిరిసిల్ల జిల్లాలో సర్పంచుల ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది. రుద్రంగి మండలంలోని రూప్లానాయక్ తండా సర్పంచ్గా జవహర్లాల్ నాయక్ను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాజాగా ఇవాళ ఉదయం అదే మండలంలోని ‘సర్పంచ్ తండా’కు సర్పంచ్(నరహరి నాయక్), ఉప సర్పంచ్(గంగారాం నాయక్)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా, ఈ రెండు తండాల్లో తొలి విడత అయిన DEC 11న ఎన్నికలు జరగాల్సి ఉండగా ఏకగ్రీవం కావడంతో ఇక ఇక్కడ ఎన్నికలు లేనట్లే.
News November 27, 2025
MLC రాజీనామాపై 4 వారాల్లో తేల్చండి: హైకోర్టు

AP: MLC జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖపై నిర్ణయాన్ని తెలపాలని మండలి ఛైర్మన్ను హైకోర్టు ఆదేశించింది. రాజీనామాపై సుదీర్ఘకాలం నిర్ణయం తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. విచారణ జరిపి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. రాజీనామా లేఖ సమర్పించినప్పటికీ చైర్మన్ ఆమోదించడం లేదని జయమంగళ వేసిన పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.


