News January 23, 2025
కామారెడ్డి: జిల్లాలో మూడో రోజు 164 గ్రామ సభలు

కామారెడ్డి జిల్లాలో మూడో రోజు 140 గ్రామసభలు, పట్టణాలకు సంబంధించి 24 వార్డు సభలు నిర్వహించారు. పిట్లంలో జరిగిన ప్రజాపాలన సభకు జుక్కల్ MLA తోట లక్ష్మీకాంత్ రావు హాజరయ్యారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని భరోసా ఇచ్చారు. జిల్లాలోని పలు మండలాల్లో జరిగిన గ్రామ సభలకు అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, విక్టర్ బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొని.. అర్హులైన వారికి పథకాలు అమలు చేస్తామన్నారు.
Similar News
News October 14, 2025
పీఎం కిసాన్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించండి: జేసీ

వీఆర్ఓ, ఎమ్మార్వో లాగిన్లలో పెండింగ్లో ఉన్న పీఎం కిసాన్ దరఖాస్తుల్లోని అవాంతరాలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. అర్హులైన రైతులకు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న రైతులకు గ్రామ సచివాలయాల ద్వారా, బ్యాంకుల సహకారంతో రుణాలు మంజూరు చేయించాలని అధికారులకు సూచించారు.
News October 14, 2025
బాధించేవే మెదడులో భారంగా ఉండిపోతాయి..!

ప్రేమతో పలకరించిన మాటల కంటే, బాధించిన విమర్శలనే మనిషి మెదడు ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. దీనికి ‘సర్వైవల్ క్యూ మెకానిజం’ కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతికూల భావోద్వేగాలు మెదడులో బలమైన నాడీ ప్రతిస్పందనలను యాక్టివేట్ చేయడం వల్ల 2 దశాబ్దాలు దాటినా గుర్తుంచుకుంటామని తెలిపారు. ప్రశంసలు సురక్షిత సంకేతాలు కాబట్టి అవి నెల రోజుల్లోనే మసకబారిపోతాయని వెల్లడించారు. మీకూ ఇలానే జరిగిందా?
News October 14, 2025
రేపు వరంగల్కు సీఎం.. ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం వరంగల్ నగరానికి రానున్నారు. నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఇటీవల మరణించగా.. బుధవారం ఆమె పెద్దకర్మను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లను సీపీ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం పర్యవేక్షించారు. హెలిప్యాడ్ ద్వారా ల్యాండ్ అవుతున్న ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్, PGR గార్డెన్స్ను సీపీ పరిశీలించి సూచనలు చేశారు.