News January 23, 2025

కామారెడ్డి: జిల్లాలో మూడో రోజు 164 గ్రామ సభలు

image

కామారెడ్డి జిల్లాలో మూడో రోజు 140 గ్రామసభలు, పట్టణాలకు సంబంధించి 24 వార్డు సభలు నిర్వహించారు. పిట్లంలో జరిగిన ప్రజాపాలన సభకు జుక్కల్ MLA తోట లక్ష్మీకాంత్ రావు హాజరయ్యారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని భరోసా ఇచ్చారు. జిల్లాలోని పలు మండలాల్లో జరిగిన గ్రామ సభలకు అదనపు కలెక్టర్‌లు శ్రీనివాస్ రెడ్డి, విక్టర్ బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొని.. అర్హులైన వారికి పథకాలు అమలు చేస్తామన్నారు.

Similar News

News November 20, 2025

HYD: హోటళ్లలో సర్వీస్ ట్యాక్స్ పేరుతో వసూళ్లు..!

image

HYDలో అనేక హోటళ్లలో సర్వీస్ టాక్స్ పేరుతో అధిక వసూళ్లు జరుగుతున్నాయి. కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ మార్గదర్శకాలకు విరుద్ధంగా పలు రెస్టారెంట్లు ఈ సర్వీస్ ఛార్జీని బిల్లుల్లో బలవంతంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బిల్లులు రూ.5 వేల- రూ.20 వేల వరకు రావడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీని కోరుతున్నారు.

News November 20, 2025

NLG: పైలట్ ప్రాజెక్టుగా 70 గ్రామాలు ఎంపిక!

image

నల్గొండ జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రభుత్వం భూభారతిలో పక్కాగా హద్దులు తేల్చేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా సర్వే కోసం జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసింది. అందులో 8,627 సర్వేనెంబర్‌ల పరిధిలో 72,758.7 ఎకరాల భూమిని సర్వే చేసి లెక్కలు తేల్చనున్నారు. రెసిడెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం ద్వారా సర్వే జరిపి అనంతరం ఆ వివరాలను భూభారతి పోర్టల్‌లో అప్లోడ్ చేయనున్నారు.

News November 20, 2025

పోలి పాడ్యమి: రేపు ఏమేం చేయాలో తెలుసా?

image

పోలి పాడ్యమి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి, 30 వత్తుల దీపం వెలిగించాలి. దాన్ని అరటి దొప్పలలో పెట్టి పారే నీటిలో వదలాలి. తద్వారా కార్తీక మాస దీపారాధన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఆ తర్వాత శివాలయానికి వెళ్లి, శివ లింగానికి అభిషేకం చేసి ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రాన్ని జపించాలి. సాయంత్రం తులసి కోట వద్ద దీపాలు వెలిగించి, పోలి స్వర్గం కథ విని, దీపదానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.