News January 23, 2025
కామారెడ్డి: జిల్లాలో మూడో రోజు 164 గ్రామ సభలు

కామారెడ్డి జిల్లాలో మూడో రోజు 140 గ్రామసభలు, పట్టణాలకు సంబంధించి 24 వార్డు సభలు నిర్వహించారు. పిట్లంలో జరిగిన ప్రజాపాలన సభకు జుక్కల్ MLA తోట లక్ష్మీకాంత్ రావు హాజరయ్యారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని భరోసా ఇచ్చారు. జిల్లాలోని పలు మండలాల్లో జరిగిన గ్రామ సభలకు అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, విక్టర్ బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొని.. అర్హులైన వారికి పథకాలు అమలు చేస్తామన్నారు.
Similar News
News September 14, 2025
ఖమ్మం జిల్లాలో దడ పుట్టిస్తోన్న డెంగీ..!

ఖమ్మం జిల్లాలో కొద్దిరోజులుగా డెంగీ దడ పుట్టిస్తోంది. రోజురోజుకూ జ్వర బాధితుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలోని వివిధ మండలాల్లో ఇప్పటి వరకు 171 కేసులు నమోదయ్యాయి. 111డెంగీ ప్రభావిత గ్రామాలుగా గుర్తించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సమావేశాల్లో ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహకులు దండుకుంటున్నారు.
News September 14, 2025
SBIలో 122 పోస్టులు

<
News September 14, 2025
బెల్లంపల్లి: ‘సారీ మమ్మీ, డాడీ నేను బతకలేను’

బెల్లంపల్లి మండలం ఆకెనపల్లికి చెందిన 9వ తరగతి విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్సై రామకృష్ణ ప్రకారం.. సుప్రియ(14)ను తల్లిదండ్రులు రోజు పాఠశాలకు వెళ్లాలని శుక్రవారం మందలించారు. మనస్తాపానికి గురై శనివారం తెల్లవారుజామున ఎలుకల గుళికలను మింగింది. ‘నాకు చదువుకోవాలని లేదు.. సారీ మమ్మీ, డాడీ నేను బతకలేను’ అంటూ వాంతులు చేసుకుంది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది.