News March 23, 2025

కామారెడ్డి జిల్లాలో వేసవి క్రీడా శిబిరం

image

కామారెడ్డి జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరం నిర్వహించినట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి జగన్నాథం శనివారం తెలిపారు. మే1 నుంచి 31 వరకు 14 సంవత్సరాలలోపు బాలికలకు ఈ శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ శిబిరం నిర్వహించుటకు ఆసక్తి గల జాతీయ స్థాయి క్రీడాకారులు ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9618126053 సంప్రదించాలని కోరారు.

Similar News

News November 17, 2025

ASF: వడ్డీ వ్యాపారులకు చిరు వ్యాపారులే టార్గెట్

image

ASF జిల్లాలో ఫైనాన్స్ పేరుతో వడ్డీ వ్యాపారులు పేదలను తీవ్రంగా దోపిడీ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధిక వడ్డీలు విధించి చిన్న వ్యాపారుల నడ్డి విరుస్తున్నారు. కట్టలేకపోతే బెదిరింపులు, గొడవలు రోజువారీగా మారాయి. అనుమతులు లేకుండా రూ.కోట్ల లావాదేవీలు జరిపినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారు. గతంలో వడ్డీ వ్యాపారులపై దాడులు కూడా జరిగిన వారి దందా మాత్రం ఆగడం లేదు.

News November 17, 2025

ఖమ్మం టీహబ్‌లో సాంకేతిక సమస్యలు!

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని తెలంగాణ హబ్(టీహబ్) ద్వారా 6.5 లక్షల మంది రోగులకు 127 రకాల ఉచిత పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కోటిన్నర విలువైన యంత్రాలు తరచుగా మొరాయిస్తుండటంతో, రోగ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయి చికిత్సలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రభుత్వం వెంటనే పాత యంత్రాల స్థానంలో కొత్త మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు.

News November 17, 2025

ఖమ్మం: కూలీల కొరత.. పత్తి రైతులకు కష్టాలు

image

పెట్టుబడి పెట్టి పండించిన పత్తి పంట చేతికొచ్చే సమయంలో రైతులకు కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వరి కోతల కారణంగా కూలీలు అటువైపు మళ్లుతుండటంతో, పత్తి కళ్లముందే ఎండిపోతోందని అన్నదాతలు మనోవేదనకు గురవుతున్నారు. ఒకవేళ కూలీలు దొరికినా, వారు కిలో పత్తికి రూ.15 నుంచి రూ.20 వరకు అధిక మొత్తంలో అడుగుతున్నారు. దీంతో పత్తి తీసిన ఖర్చులకే సరిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.