News April 5, 2024

కామారెడ్డి జిల్లాలో 10,328 ఎకరాల్లో పంట నష్టం

image

కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వడగళ్ల, అకాల వర్షాలకు జిల్లాలో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ శాఖ యంత్రాంగం రైతు వారి సర్వే చేపట్టింది. జిల్లాలో10,328 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి తెలిపారు. వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయ పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు గుర్తించారు. నివేదికలను ఉన్నతాధికారులకు పంపారు.

Similar News

News February 1, 2025

రుద్రూర్: బట్టలు ఉతకడానికి వెళ్లి యువకుడి దుర్మరణం

image

రుద్రూర్ మండలం అక్బర్ నగర్ చెరువులో శుక్రవారం రాత్రి JNC కాలనీకి చెందిన సాజన్(36) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. గురువారం సాయంత్రం బట్టలు ఉతకాడానికి బైక్ పై వెళ్లిన సాజన్ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా చెరువులో మృతదేహం లభించింది. ఎస్ఐ సాయన్న ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు

News February 1, 2025

మెండోరా: బ్యాంక్ చోరీకి ప్రయత్నించిన వ్యక్తి అరెస్ట్

image

మెండోరాలో 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న SBI బ్యాంకులో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో నెహ్రునగర్ గ్రామానికి చెందిన శ్యామ్ అనే వ్యక్తి బ్యాంక్ షటర్ తాళాలు పగలగొట్టి షటర్ తీసే ప్రయత్నం చేశాడు. షటర్ తెరుచుకోకపోవడంతో వెనుదిరిగాడు ఉదయం బ్యాంకు మేనేజర్ వచ్చి సీసీ కెమెరాలు చూడటంతో దొంగతనానికి పాల్పడినట్లు గమనించి మెండోరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శ్యామ్‌ను అరెస్టు చేశారు.

News February 1, 2025

NZB: ఆదిత్య హృదయ స్తోత్ర పఠనంలో రికార్డు

image

ఆదిత్య హృదయ స్తోత్రం చదవడంలో నిజామాబాద్‌కు చెందిన సహాన్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు సాధించినట్లు తెలుగు వెలుగు సమాఖ్య కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. 31 శ్లోకాలు గల ఆదిత్య హృదయ స్తోత్రమును 2వ తరగతి చదువుతున్న సహాన్ కేవలం 3 నిమిషాలు 24 సెకన్లలో స్వర యుక్తంగా చదివి జాతీయ స్థాయి రికార్డు సాధించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 3న రైల్వే స్టేషన్ రోడ్డు గీత భవనంలో ఆశీర్వద సభ ఉంటుందన్నారు.