News April 5, 2024

కామారెడ్డి జిల్లాలో 10,328 ఎకరాల్లో పంట నష్టం

image

కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వడగళ్ల, అకాల వర్షాలకు జిల్లాలో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ శాఖ యంత్రాంగం రైతు వారి సర్వే చేపట్టింది. జిల్లాలో10,328 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి తెలిపారు. వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయ పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు గుర్తించారు. నివేదికలను ఉన్నతాధికారులకు పంపారు.

Similar News

News January 25, 2025

నిజామాబాద్: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాది

image

నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో 15వ జాతీయ ఓటరు దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాదిగా నిలుస్తోందని, దీనిని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

News January 25, 2025

బాల్కొండ: ఎన్నికల కోసమే రైతుబంధు: MLA

image

ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును తెరపైకి తెచ్చిందని మాజీ మంత్రి, బాల్కొండ MLA వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. BRS ఆధ్వర్యంలో సాగు, సంక్షేమ పరిస్థితులపై అధ్యయనానికి ఏర్పాటైన కమిటీ జిల్లాలో పర్యటిస్తోంది. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, MLCలు యాదవరెడ్డి, కోటిరెడ్డి, మెండోరా మండలం బుస్సాపూర్‌లో రైతులతో శనివారం సమావేశమయ్యారు.

News January 25, 2025

NZB: వృద్ధులను అభినందించిన కలెక్టర్

image

ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న 80 ఏళ్లు పైబడిన వృద్ధులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్లు నాగుల సాయమ్మ, కొట్టూర్ ఇందిరా, అవధూత భూమయ్య, మెరుగు ఒడ్డెమ్మ, అంకం సుశీల, వై.నర్సయ్యలను ఘనంగా సన్మానించారు. కొత్తగా నమోదైన యువ ఓటర్లకు ఐడీ కార్డులను అందజేశారు.