News March 4, 2025
కామారెడ్డి జిల్లాలో 38 ఇంటర్ పరీక్ష కేంద్రాలు

కామారెడ్డి జిల్లాలో 38 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం తెలిపారు. ఈ నెల 5 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా పరీక్షలు కొనసాగుతాయని చెప్పారు.
Similar News
News October 15, 2025
కామారెడ్డి: 2 రోజులే ఛాన్స్.. వెంటనే అప్లై చేయండి!

కామారెడ్డి జిల్లాలోని 11 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఈ విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయాధికారి నాగేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు హాజరైన, ఇంతవరకు సీటు పొందని విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4.30 వరకు ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకులంలో దరఖాస్తులను అందజేయాలన్నారు.
News October 15, 2025
PCC చీఫ్ సబ్జెక్టు తెలుసుకుని మాట్లాడాలి: MP

రాష్ట్ర PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ROB నిధులపై సరైన అవగాహన లేదని, ముందుగా సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలని నిజామాబాద్ MP అరవింద్ ధర్మపురి సూచించారు. బుధవారం MP మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం BJPపై బురద జల్లి BRSను కాపాడే ప్రయత్నం చేస్తుందని, కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వమే కమిటీ వేసి అవకతవకలు ఉన్నాయని తేలినా ఏమి చేయలేదన్నారు.
News October 15, 2025
నిధులు ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తా: MP

NZB జిల్లాలోని ROBలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుంటే వారంలో నిరాహార దీక్ష చేపడుతానని MP ధర్మపురి అర్వింద్ ప్రకటించారు. BJP జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. అడవి మామిడిపల్లి ఆర్ఓబీకి రూ.22 కోట్లు అవసరమైతే, కొన్ని ఏళ్ల క్రితమే సుమారు రూ.18 కోట్లు డిపాజిట్ చేయగా గత ప్రభుత్వం నిధులను మళ్లించిందన్నారు. మాధవ్ నగర్ ఆర్ఓబీకి కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 70% వచ్చాయన్నారు.