News March 30, 2024
కామారెడ్డి జిల్లాలో 42 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. శుక్రవారం జిల్లాలోని బిచ్కుందలో అత్యధికంగా 41.9 ఉష్ణోగ్రత నమోదు కాగా, దోమకొండలో 40.5, రామారెడ్డి, గాంధారిలో 40.4, నస్రుల్లాబాద్లో 40.2, పాల్వంచలో 40.1 ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యల్పంగా బీర్కూర్ మండలంలో 36.4 ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News February 12, 2026
నందిపేట్: ఇద్దరి మృతి.. రెండు కుటుంబాల్లో విషాదం

నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరుశివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శివ (28) బుధవారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఈనెల 2న నందిపేట్–కొండూరు మార్గంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో కొడుపల సాగర్ (30) చికిత్స పొందుతూ మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన శివ కూడా బుధవారం మృతి చెందాడు. ఒకే ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News February 12, 2026
భీంగల్లో అత్యధికం.. నిజామాబాద్లో అత్యల్పం

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి భీమ్గల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 69.78 శాతం పోలింగ్ నమోదవ్వగా NZB కార్పొరేషన్లో అత్యల్పంగా 59.12 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఆర్మూర్ మున్సిపాలిటీలో 68%, బోధన్లో 68.64 % నమోదైంది. భీంగల్లో 14,045 ఓట్లకు గాను 9,800 ఓట్లు, NZBలో 3,48,951 ఓట్లకు గాను 2,05,753 ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో 4,95,485 మంది ఓటర్లకు 3,06,697 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
News February 12, 2026
నిజామాబాద్: వార్ వన్ సైడ్… లేక హంగ్..?

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్, బీజేపీ తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే మొత్తం 60 వార్డుల్లో మ్యాజిక్ ఫిగర్ 30కి చాలా దగ్గర బీజేపీకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్కు 20కి అటు ఇటుగా, MIMకు 10కి పైబడి డివిజన్లు వచ్చే అవకాశం ఉందని, అయితే మేయర్ ఎన్నిక నాటికి ఎక్స్అఫీషియో ఓట్లు, ఇతర సమీకరణాలు కీలకమవుతాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.


