News May 2, 2024

కామారెడ్డి జిల్లాలో 4,546 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

image

ఎన్నికల విధులు, ఇతర అత్యవసర విధులు నిర్వహిస్తున్న 4,546 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని KMR జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో 1,081, ఎల్లారెడ్డిలో 1,298, కామారెడ్డి నియోజకవర్గంలో 2,167 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ వివరించారు.

Similar News

News November 2, 2025

నిజామాబాద్: అలసత్వ వహిస్తే ఉపేక్షించేది లేదు: బక్కి వెంకటయ్య

image

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఉద్యోగుల ప్రమోషన్‌లలో రిజర్వేషన్ అమలుపై కలెక్టర్, సీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. భవానిపేట, గొరెగామ్‌లలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.

News November 2, 2025

రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా NZB జిల్లా కలెక్టర్, ఇతర ఎన్నికల అధికారులతో మాట్లాడారు. ఓటర్ల నిర్ధారణ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కేటగిరి సీ, క్యాటగిరి డీలలోని ఓటర్లను కేటగిరి ఏకు మ్యాపింగ్ చేసే ప్రక్రియను మెరుగుపరచాలని ఆదేశించారు.

News November 1, 2025

NZB: కలెక్టర్, సీపీతో ఎస్టీ, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ భేటీ

image

రాష్ట్ర షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం NZB కలెక్టరేట్‌లో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసుల్లో పురోగతి, ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమస్యలపై బాధితుల నుంచి విజ్ఞాప్తులు స్వీకరించారు.