News June 15, 2024

కామారెడ్డి జిల్లాలో 961 మంది ఆత్మహత్య

image

మానసిక ఒత్తిళ్లు, కుటుంబ, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు.. ఇలా వివిధ కారణాలతో తనువు చాలించే వారి సంఖ్య కామారెడ్డి జిల్లాలో పెరుగుతోంది. జిల్లాలో రోజూ ఏదో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య కేసులు నమోదు అవుతునే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2022లో 416 మంది, 2023లో 386 మంది, ఈ ఏడాది ఇప్పటి వరకు 159 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

Similar News

News October 5, 2024

NZB: GREAT.. ఒకేసారి ఐదు ఉద్యోగాలు

image

నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలానికి చెందిన మంచిప్ప గ్రామ యువతి తూర్పు అర్చన ఏకకాలంలో ఐదు ఉద్యోగాలు సాధించింది. ఏఈ, ఏఈఈ, పాలిటెక్నిక్ లెక్చరర్, గ్రూప్-4, టీపీడీఓ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా తూర్పు అర్చన మాట్లాడుతూ.. తాను సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారని తన భర్త రాకేష్ సాకారంతో ఇంతటి ఘన విజయాన్ని సాధించారని తెలిపారు.

News October 5, 2024

కలెక్టరేట్లో ఘనంగా జి.వెంకటస్వామి జయంతి వేడుకలు

image

కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ కలెక్టరేట్లో జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

News October 5, 2024

NZB: ఆన్లైన్ బెట్టింగ్‌… ముగ్గురు ఆత్మహత్య!

image

ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పులపాలై వాటిని తీర్చలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎడపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వడ్డేపల్లికి చెందిన రంగననేని సురేష్, హేమలత దంపతుల కుమారుడు హరీశ్.. ఆన్లైన్ బెట్టింగులకు బానిసయ్యాడు. దీంతో ఆ కుటుంబం అప్పులపాలైంది. వాటిని తీర్చేందుకు ఉన్న పొలాన్ని అమ్మివేసినా అప్పు తీరకపోవడంతో ముగ్గురు శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.