News February 6, 2025
కామారెడ్డి: జిల్లా అధ్యక్షురాలి నియామకం

మహిళా కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా పాక జ్ఞానేశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆమెకు నియామకపత్రాన్ని అందజేశారు. రెండోసారి తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షురాలిగా నియమించిన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలంబ, రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 25, 2025
GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభం

GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్తో పాటు ఆయా పార్టీల MPలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మొత్తం 46 అజెండాలపై సమావేశంలో చర్చలు జరపనున్నారు. జూబ్లీహిల్స్ MLA మాగంటి, కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్, అందెశ్రీ మృతి పట్ల 2 నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు.
News November 25, 2025
KCR, KTR.. కాస్ట్లీ భూములు ఆక్రమించారు: ఫోరెన్సిక్ ఆడిట్

సిరిసిల్ల జిల్లాలో ధరణి పోర్టల్పై ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తైంది. జిల్లాలో ధరణి పోర్టల్ దుర్వినియోగంపై ప్రభుత్వం తుదిమెరుగులు దిద్దుతోంది. KCR, KTR, హరీష్ రావుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ధరణి పోర్టల్ సాయంతో ఖరీదైన భూములను ఆక్రమించారని ప్రాథమిక పరిశోధనలు చెబుతున్నాయి. తుది నివేదికను త్వరలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమర్పించనున్నారు.
News November 25, 2025
అమరావతిలో 25 బ్యాంకుల శంకుస్థాపనకు సిద్ధం

అమరావతిని ఆర్థిక–వాణిజ్య కేంద్రంగా మార్చే దిశగా పెద్ద అడుగు పడుతోంది. ఈ నెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ CRDA కార్యాలయంతో పాటు ఏర్పాటు చేసిన వేదికపై 25 బ్యాంకుల కొత్త భవనాలకు శంకుస్థాపన చేస్తారు. RBI రీజియనల్ ఆఫీస్తో పాటు జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల భూముల కేటాయింపు పూర్తైంది. 49.5 ఎకరాలు సంస్థలకు, 12.66 ఎకరాలు అధికారుల నివాసాలకు కేటాయించారు.


