News February 5, 2025
కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్లో 1109 మంది అరెస్టు

కామారెడ్డి జిల్లాలో మద్యం సేవించి జనవరి నెలలో 1109 మంది వాహనదారులు పట్టుబడినట్లు ఎస్పీ సింధుశర్మ తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన జరిమానాలు విధిస్తామన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూదని తల్లిదండ్రులకు ఎస్పీ సింధుశర్మ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News March 23, 2025
మెదక్: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సునీత లక్ష్మారెడ్డి కాలనీలో నివాసం ఉండే సిరివెన్నెల అనే వివాహిత ఈనెల 20న హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల వద్ద ఎక్కడ వెతికిన ఆచూకీ లభించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 23, 2025
సంగారెడ్డి: పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ చేసిన కలెక్టర్

సదాశివపేట మండలం నాగసాన్ పల్లి పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం జారీ చేశారు. గ్రామంలో ఫైనల్ నోటిఫికేషన్ చేయకుండానే వెంచర్లకు అనుమతి ఇచ్చారని, కొందరు డీపీవోకు ఫిర్యాదు చేశారు. డీపీవో విచారణ నివేదిక ఆధారంగా పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
News March 23, 2025
ప్రజలకు విద్య, వైద్యం చాలా ముఖ్యం: శబరీష్

నేటి సమాజంలో ప్రజలకు విద్య వైద్యం ఎంతో ముఖ్యమని ములుగు ఎస్పీ శబరీష్ అన్నారు. వాజేడు మండలం కొంగాల గ్రామంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని శనివారం ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల శ్రేయస్సు పోలీసుల ప్రథమ కర్తవ్యం అని ఎస్పీ అన్నారు. సమాజంలోని యువత చెడు వ్యసనాలకు బానిస కాకూడదని, వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.