News January 28, 2025

కామారెడ్డి: ‘దివ్యాంగులకు రుణాలు ఇవ్వాలి’

image

దివ్యాంగులకు పలు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని రాష్ట్ర వికలాంగుల పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు భూపతి కోరారు. ఆయన కామారెడ్డి లో మాట్లాడుతూ.. రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనిత రాయ్ చంద్రన్‌ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.  దివ్యాంగులకు ప్రభుత్వం ద్వారా కావలసిన పరికరాలు అందించాలని కోరినట్లు చెప్పారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.

Similar News

News December 21, 2025

అబద్ధాలు ఆపండి.. మోదీపై కాంగ్రెస్ ఫైర్

image

స్వతంత్రానికి ముందు అస్సాంను పాక్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందని PM మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ తీవ్రంగా స్పందించింది. మోదీ అబద్ధాలు ఆపాలని మండిపడింది. ‘అస్సాంను పాక్‌కు ఇచ్చే ప్రపోజలే అప్పట్లో లేదు. కాంగ్రెస్ కుట్ర చేసిందనడానికి ఆధారాలు లేవు. చరిత్రను ప్రచార నినాదంగా PM మార్చుకున్నారు. RSS శిక్షణ పొందిన వ్యక్తి అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు’ అని కాంగ్రెస్ MP మాణికం ఠాగూర్ ఫైరయ్యారు.

News December 21, 2025

కృష్ణా: మళ్లీ బీసీ వర్గానికి టీడీపీ జిల్లా పీఠం

image

టీడీపీ కృష్ణా జిల్లా పీఠం మరోసారి BC వర్గాలకే దక్కింది. BC (గౌడ) వర్గానికి చెందిన వీరంకి వెంకట గురుమూర్తిని జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గత రెండు పర్యాయాలు కూడా BC వర్గానికి చెందిన బచ్చుల అర్జునుడు, కొనకళ్ల నారాయణరావులే TDP జిల్లా అధ్యక్షులుగా పనిచేసి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. గురుమూర్తి నాయకత్వంలో కూడా పార్టీ మరింత బలోపేతం కానుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

News December 21, 2025

పాకిస్థాన్ భారీ స్కోరు

image

అండర్-19 మెన్స్ ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 347-8 పరుగులు చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ 113 బంతుల్లో ఏకంగా 172 రన్స్ బాదారు. ఇందులో 9 సిక్సర్లు, 17 ఫోర్లు ఉన్నాయి. అహ్మద్ హుస్సేన్ (56), ఉస్మాన్ ఖాన్ (35) రాణించారు. భారత బౌలర్లలో దేవేంద్రన్ 3, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్ తలో 2, కనిష్క్ చౌహాన్ ఒక వికెట్ తీశారు.