News March 26, 2025
కామారెడ్డి: ‘ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి’

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వరి ధాన్యం అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రబీ సీజన్లో ధాన్యం సేకరణకు సరిపడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
Similar News
News December 22, 2025
వాట్సాప్లో ఫొటోలు డౌన్లోడ్ చేస్తే అంతే!

UP లక్నోకు చెందిన ప్రశాంత్ వర్మ వాట్సాప్లో వచ్చిన ఫొటోను డౌన్లోడ్ చేసి రూ.4.44 లక్షలు పోగొట్టుకున్నారు. ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడని, అతని జేబులో మీ గుర్తింపు కార్డు ఉందని కేటుగాళ్లు ఫోన్ చేసి నమ్మించారు. అతని ఫొటోను వాట్సాప్లో పంపించగా.. డౌన్లోడ్ చేయగానే ఫోన్లో APK ఫైల్ ఇన్స్టాల్ అయి నగదు మాయమైంది. అపరిచిత వ్యక్తులు పంపే ఫొటోలు, ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
News December 22, 2025
RSSను పటేల్ బ్యాన్ చేశారు: జైరాం రమేశ్

<<18632147>>RSSపై<<>> కాంగ్రెస్ MP జైరాం రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సర్దార్ పటేల్ RSSను నిషేధించారన్నారు. ‘రహస్య సంస్థలా కాకుండా పారదర్శకంగా పనిచేయాలంటూ గురు గోల్వాల్కర్కు పటేల్ లేఖ రాశారు’ అని తెలిపారు. నాగ్పూర్ కేంద్రంలో దశాబ్దాల పాటు జాతీయ జెండా ఎగరవేయకపోవడం, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత అంబేడ్కర్, పటేల్, నెహ్రూ, గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేయడాన్ని ప్రస్తావిస్తూ ఆ సంస్థ సిద్ధాంతాన్ని ప్రశ్నించారు.
News December 22, 2025
మంగళగిరిలో బాలికపై గ్యాంగ్రేప్.. లోకేశ్ స్పందించరా: వైసీపీ

AP: మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో బాలిక(13)పై గ్యాంగ్ రేప్ జరిగిందని YCP ట్వీట్ చేసింది. ఈ ఘటనపై లోకేశ్ సైలెంట్గా ఉన్నారని ఆరోపించింది. ‘తన సొంత నియోజకవర్గంలో ఇంత భయంకరమైన నేరం జరిగితే లోకేశ్ స్పందించకపోవడం మహిళల భద్రత విషయంలో ఆయన ఉదాసీనతను సూచిస్తోంది. రాజకీయ నిర్లక్ష్యం వల్ల శాంతిభద్రతలు దెబ్బతినకూడదు’ అని పేర్కొంది. బాధితురాలకి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.


