News February 20, 2025
కామారెడ్డి: నరేందర్ రెడ్డిని గెలిపించాలి: MP

కామారెడ్డి సత్యాగార్డెన్లో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏడాది కాలంలో ఏకంగా 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. మెదక్, NZB, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల MLC అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు.
Similar News
News January 2, 2026
తాండూర్: ముగ్గు వేస్తున్న మహిళపై వీధి కుక్క దాడి

తాండూర్ మండలం రేచినిలోని పోచమ్మవాడకు చెందిన మామిడి రాజేశ్వరిపై శుక్రవారం వీధి కుక్క దాడి చేసింది. ఉదయం ఇంటి ముందు రాజేశ్వరి ముగ్గు వేస్తున్న సమయంలో కుక్క దాడి చేసి గాయపరిచిందని స్థానికులు తెలిపారు. మహిళను చికిత్స నిమిత్తం108 వాహనంలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుక్కల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
News January 2, 2026
APPLY NOW: బాల్మర్ లారీలో ఉద్యోగాలు

బాల్మర్ లారీలో 18 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే(JAN 4) ఆఖరు తేదీ. పోస్టును బట్టి MTM, MBA, BE/B.Tech,డిగ్రీ, MCA ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.balmerlawrie.com
News January 2, 2026
ఏపీలో పెరిగిన GST వసూళ్లు

AP: డిసెంబర్లో రాష్ట్ర GST వసూళ్లు పెరిగాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 5.78% ఎక్కువగా రూ.2,652 కోట్లు వసూలైంది. జాతీయ సగటును (5.61%) సైతం మించింది. దీంతో దక్షిణాదిలో తమిళనాడు తర్వాత రెండో స్థానంలో నిలిచింది. స్థూల వసూళ్లు రూ.3,137 కోట్లకు చేరాయి. SGST, IGST, పెట్రోలియం వ్యాట్, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆదాయాలు కూడా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.39,517 కోట్ల పన్ను ఆదాయం వచ్చింది.


