News October 30, 2024
కామారెడ్డి: ‘నవంబర్ 9, 10వ తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు’

నవంబర్ 9, 10 వ తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ తెలిపారు. జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఆన్లైన్ ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లోని బిఎల్ఓ లకు ఆఫ్ లైన్ ద్వారా అర్హత గల యువతీ యువకులు దరఖాస్తులు చేసుకోవచ్చును.
Similar News
News November 21, 2025
NZB: జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి: TWJF

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని TWJF నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రాల్లోని విలేకరులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. దాడుల నుంచి జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు చట్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రామచందర్ రెడ్డి, రాజు, పరమేశ్వర్, భాస్కర్, ప్రవీణ్, అనిత తదితరులు పాల్గొన్నారు.
News November 21, 2025
ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి నిజామాబాద్ రచయితకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష రక్షణ వేదిక మాజీ అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో డిసెంబర్ 27, 28 తేదీల్లో విజయవాడలో జరగనున్న ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి NZB జిల్లాకు చెందిన రచయిత ప్రేమ్ లాల్ ఆహ్వానం అందుకున్నారు. ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి పిలుపు రావడం పట్ల ప్రేమ్ లాల్ ఆనందం వ్యక్తం చేశారు. సాహితీ మిత్రులు శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.
News November 21, 2025
NZB: గోల్డ్ మెడల్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణం: TPCC చీఫ్

గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కప్-2025లో NZBకు చెందిన నికత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ క్రీడా గౌరవాన్ని మరోసారి ప్రపంచ వేదికపై ప్రతిష్టాత్మకంగా నిలబెట్టారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి దేశ, రాష్ట్ర ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.


