News January 29, 2025

కామారెడ్డి: నిబంధనలు పాటించకపోతే చర్యలు: డీఈవో

image

పాఠశాల సమయాల్లో పదవీ విరమణ, సన్మాన కార్యక్రమాల నిర్వహణపై కొన్ని సూచనలు సలహాలను డీఈవో రాజు నోటీసుల రూపంలో జారీ చేశారు. పదవీ విరమణ పాఠశాల సమయాల్లో, పనివేళల్లో నిర్వహిస్తే బోధనకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. ఈ విధంగా ఉపాధ్యాయుల వ్యవహరించడంతో పాఠశాల విద్యార్థులు, చుట్టుపక్కల, ఇతర పాఠశాలల్లో పని చేస్తున్న ఇతర ఉపాధ్యాయులతో హాజరవుతున్నారని, ఇది విద్యార్థుల సాధారణ బోధనకు చాలా ఆటంకం కలుగుతుందన్నారు.

Similar News

News December 8, 2025

డెలివరీ తర్వాత జరిగే హార్మోన్ల మార్పులివే..!

image

ప్రసవం తర్వాత స్త్రీల శరీరంలోని హార్మోన్లలో మార్పులు వస్తుంటాయి. డెలివరీ అయిన వెంటనే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు పడిపోతాయి. దీంతో మొదటి 2 వారాల్లో చిరాకు, ఆందోళన, లోన్లీనెస్, డిప్రెషన్ వస్తాయి. అలాగే ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ ఎక్కువగా ఉండటంతో యోని పొడిబారడం, లిబిడో తగ్గడం వంటివి జరుగుతాయి. దీంతో పాటు స్ట్రెస్ హార్మోన్, థైరాయిడ్ డిస్‌ఫంక్షన్ వంటివి కూడా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

News December 8, 2025

అనంత: అనాధ పిల్లలకు హెల్త్ కార్డుల పంపిణీ

image

అనాధ పిల్లల కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని అనాధ పిల్లలకు హెల్త్ కార్డులను తయారు చేయించింది. అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఈ కార్డులను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఈ సేవను అందిస్తున్న సంగతి తెలిసిందే.

News December 8, 2025

వాజేడు మండలంలో యాక్సిడెంట్.. ఒకరు మృతి

image

ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెరుకూరు మీదుగా వెళ్ళుతున్న మిని టాక్సీ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గొంది సాంబశివరావు (45) మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి వాజేడు ఎస్ఐ జక్కుల సతీష్ చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.