News August 8, 2024
కామారెడ్డి: పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ KMR కోర్టు గురువారం తీర్చునిచ్చింది. లింగంపేట మండలానికి చెందిన గుడ్డేల రాములు అదే మండలానికి చెందిన బాలిక(8)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 2018 జులై 8న పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి లాల్ సింగ్ నిందితుడికి జైలు శిక్ష విధించారు.
Similar News
News November 28, 2025
TPCC చీఫ్ను కలిసిన NZB DCC అధ్యక్షుడు

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన కాట్ పల్లి నగేష్ రెడ్డి శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఇద్దరూ భేటీ అయ్యి నిజామాబాద్ జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతం, రాబోయే కార్యక్రమాల వ్యూహాలపై చర్చించారు.
News November 28, 2025
NZB: ముసాయిదా విత్తన బిల్లు-2025పై అభిప్రాయాల సేకరణ

వ్యవసాయ శాఖ ద్వారా రూపొందించిన ముసాయిదా విత్తన బిల్లు-2025పై అభిప్రాయ సేకరణ జరిపారు. IDOCలో వ్యవసాయ అధికారులతో పాటు రైతు ప్రతినిధులు, విత్తన డీలర్లు, కంపెనీలు, విత్తన ఉత్పత్తిదారులతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బిల్లులోని అంశాలపై చర్చించారు. ముసాయిదా బిల్లులో పొందుపర్చిన నాసిరకం విత్తనాల కారణంగా పంట ఉత్పత్తి, విక్రయ దశ, నష్టపరిహారం అందించే అంశాలపై చర్చించారు.
News November 28, 2025
నిజామాబాద్: విద్యను కార్పొరేట్ ఉత్పత్తి సాధనంగా మార్చాయి

దేశంలో విద్యను కార్పొరేటు ఉత్పత్తి సాధనంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చాయని ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్య అన్నారు. నిజామాబాద్ జిల్లా 23వ మహాసభలు ఆర్మూర్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆర్మూర్లోని హనుమాన్ ఆలయం నుంచి CVR జూనియర్ కళాశాల వరకు వేలాది మంది విద్యార్థులతో విద్యార్థి ప్రదర్శన, అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.


