News February 17, 2025

కామారెడ్డి: ప్రజావాణిలో 58 ఫిర్యాదులు వెల్లువ

image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజావాణిలో 58 ఫిర్యాదులు వచ్చినట్లు వివరించారు.

Similar News

News December 20, 2025

ఇంట్లోనే మానిక్యూర్ చేసుకోవచ్చు

image

అందంగా, ఆరోగ్యంగా ఉండే గోళ్ల కోసం మానిక్యూర్ చేసుకోవడం తప్పనిసరి. దీన్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. ముందుగా పాత నెయిల్ పాలిష్‌ని తొలగించాలి. తర్వాత గోళ్లను షేప్ చేసుకొని గోరువెచ్చటి నీటిలో షాంపూ, నిమ్మరసం కలిపి దాంట్లో చేతులు ఉంచాలి. తర్వాత చేతులను స్క్రబ్ చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చివరిగా మీకు నచ్చిన నెయిల్ పాలిష్ వేస్తే సరిపోతుంది. లేత రంగులు వేస్తే గోళ్లు సహజంగా అందంగా కనిపిస్తాయి.

News December 20, 2025

డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యం: కలెక్టర్

image

మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ జాతీయ, రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం కదిరి R&B గెస్ట్ హౌస్‌ నుంచి మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ చేశారు. కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీశ్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నేటి యువత ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమన్నారు.

News December 20, 2025

ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలివే: ICMR స్టడీ

image

భారత్‌లో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ టాప్ 3లో ఉంది. తాజాగా ICMR చేసిన స్టడీలో లేట్ మ్యారేజ్, 30 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ, 50 దాటాక మెనోపాజ్ వల్ల ఈ క్యాన్సర్ రిస్క్ పెరుగుతున్నట్లు తేలింది. పొట్ట దగ్గర ఫ్యాట్, ఫ్యామిలీ హిస్టరీ, నిద్రలేమి, స్ట్రెస్ వంటి సమస్యలు కూడా ప్రమాదాన్ని పెంచుతున్నాయి. 40 ఏళ్ల నుంచే రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని స్టడీ సూచించింది.