News March 27, 2025
కామారెడ్డి: ప్రైవేటు ఆసుపత్రి ముసివేయాలని హైకోర్టు నోటీసులు

కామారెడ్డిలోని సమన్విత హాస్పిటల్లో అక్రమ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ, గర్భవిచ్చితి, శిశువిక్రయాలు వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. హైకోర్టు ఆదేశాలతో ఆసుపత్రిని మూసివేయాలని నిర్ణయం తీసుకొని నోటీసులు అందజేశారు. ఆసుపత్రి యాజమాన్యం నిరాకరించడంతో హైకోర్టు ఉత్తర్వులను ఆసుపత్రి గేట్లకు అతికించారు. ఈ విషయాన్ని డీఎంహెచ్వో చంద్రశేఖర్ తెలిపారు.
Similar News
News November 19, 2025
కగార్ ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి: సీపీఐ

కగార్ ఆపరేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న మావోయిస్టుల ఎన్కౌంటర్లన్నింటిపైనా న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్తో కలిసి ఆయన ఈ మేరకు తెలిపారు.
News November 19, 2025
PM కిసాన్ 21వ విడత.. రూ.18 వేల కోట్లు జమ

దేశ వ్యాప్తంగా అన్నదాతలకు రబీ పెట్టుబడి సాయం కింద PM కిసాన్ 21వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో.. దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున రూ.18వేల కోట్లను ప్రధాని జమ చేశారు. ఇప్పటి వరకు PM కిసాన్ 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో కేంద్రం జమ చేసింది.
News November 19, 2025
నంబర్-1 ర్యాంక్ కోల్పోయిన రోహిత్

ICC ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ నంబర్-1 స్థానాన్ని కోల్పోయారు. కివీస్ బ్యాటర్ మిచెల్ 782 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా, హిట్ మ్యాన్(781) సెకండ్ ప్లేస్లో నిలిచారు. NZ తరఫున ODIలలో టాప్ ర్యాంక్ సాధించిన రెండో బ్యాటర్గా మిచెల్ రికార్డు సాధించారు. చివరిసారిగా 1979లో టర్నర్ నం.1 అయ్యారు. ఇక 3-10 స్థానాల్లో జోర్డాన్, గిల్, కోహ్లీ, బాబర్, టెక్టర్, అయ్యర్, అసలంక, హోప్ ఉన్నారు.


