News March 27, 2025

కామారెడ్డి: ప్రైవేటు ఆసుపత్రి ముసివేయాలని హైకోర్టు నోటీసులు

image

కామారెడ్డిలోని సమన్విత హాస్పిటల్‌లో అక్రమ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ, గర్భవిచ్చితి, శిశువిక్రయాలు వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. హైకోర్టు ఆదేశాలతో ఆసుపత్రిని మూసివేయాలని నిర్ణయం తీసుకొని నోటీసులు అందజేశారు. ఆసుపత్రి యాజమాన్యం నిరాకరించడంతో హైకోర్టు ఉత్తర్వులను ఆసుపత్రి గేట్లకు అతికించారు. ఈ విషయాన్ని డీఎంహెచ్వో చంద్రశేఖర్ తెలిపారు.

Similar News

News October 16, 2025

సిరిసిల్ల: జువైనల్ కోర్టును ప్రారంభించిన న్యాయమూర్తి

image

సిరిసిల్లలో జువైనల్ కోర్టును న్యాయమూర్తి కావేటి సృజన గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ.. బాలల న్యాయ చట్టానికి అనుగుణంగా జిల్లాలో బాలల స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తగు చర్యలు చేపడుతుందన్నారు. బోర్డు మెంబర్ శ్రీ రమణ, కళ్యాణ్, చక్రవర్తి, వెంకట్, సంతోష్, శోభన తదితరులు పాల్గొన్నారు.

News October 16, 2025

పారదర్శకంగా ఓటర్ల జాబితా నవీకరణ : కలెక్టర్

image

ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా నిరంతరంగా కొనసాగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.
గురువారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫారం 6 లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఫారం 6 లను సంపూర్ణంగా పూర్తిచేసే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు నూతన ఓటర్లకు అవగాహన కలిగించాలన్నారు.

News October 16, 2025

MBNR: పీయూలో ఘనంగా స్నాతకోత్సవం!

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయం ఆడిటోరియంలో 4వ స్నాతకోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. గురువారం మొత్తం 83 బంగారు పతకాలను పీయూ ఛాన్స్‌లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పీయూ ఉపకులపతి(VC) ఆచార్య డాక్టర్ జీఎన్ శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సంవత్సరంలో ఆయా విభాగాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన 12 మంది పరిశోధకులు పట్టాలు అందుకున్నారు.