News March 9, 2025
కామారెడ్డి: బాధితురాలి వద్దకే జడ్జి

కామారెడ్డిలోని జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో భాగంగా అదనపు జూనియర్ న్యాయమూర్తి దీక్ష బట్టు ఒక కేసులో బాధితురాలు వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలు స్వప్న నడవలేని స్థితిలో ఉండటంతో ఆమె వద్దకు వెళ్లారు. కేసు విషయంలో రాజీ కుదిర్చరు. వెంట న్యాయవాదులు జడల రజనీకాంత్, వేణు ప్రసాద్ ఉన్నారు.
Similar News
News January 15, 2026
GNT: రాజధాని భూముల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్!

పల్నాడు, గుంటూరు జిల్లాల్లో 2వ విడతగా 20,494 ఎకరాల భారీ భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో రాజధాని ప్రాంతంలో సందడి మొదలైంది. ఈ భూముల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, రైల్వే లైన్ వంటి మెగా ప్రాజెక్టులు రానున్నట్లు తెలుస్తోంది. అమరావతి ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల అనుసంధానంతో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. ఏ గ్రామంలో ఏ ప్రాజెక్టు రాబోతుందనే అంశంపై స్థానిక ప్రజల్లో ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
News January 15, 2026
‘ఈసారి బులెట్ మిస్ అవ్వదు’.. ట్రంప్కు హెచ్చరిక

ఇరాన్ ప్రభుత్వానికి చెందిన టీవీ ఛానెల్ (Islamic Republic State TV) ట్రంప్కు హెచ్చరికలు చేస్తూ సంచలన ప్రసారాలు చేసింది. 2024 ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్పై జరిగిన హత్యాయత్నం దృశ్యాలను టెలికాస్ట్ చేస్తూ, ‘ఈసారి బులెట్ మిస్ అవ్వదు’ అంటూ హెచ్చరించింది. తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఇరాన్ను ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రసారం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దీనిపై ఆ దేశ అధికారులు స్పందించలేదు.
News January 15, 2026
చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.


