News July 15, 2024

కామారెడ్డి: బాల కార్మికులు లేకుండా అధికారులు చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో బాల కార్మికులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఛైల్డ్ లేబర్ జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బాల కార్మికుల నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. 14 సంవత్సరాలోపు చిన్నారులతో ఏ పని చేయించవద్దని పేర్కొన్నారు.

Similar News

News December 14, 2025

నిజామాబాద్: వామ్మో చలి.. మూడు రోజులుగా వణుకు పుట్టిస్తోంది

image

గత మూడు రోజులుగా చలి గజగజ వణికిస్తోంది. దీంతో ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రం నుంచి మొదలైన చలి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు పంజా విసురుతోంది. పెరిగిన చలి తీవ్రతను తట్టుకోలేక చాలామంది ఎండలో నిలబడి ఉపశమనం పొందుతున్నారు. కొందరు ఇళ్లలోనే మంట కాచుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ్రత వల్ల చాలామంది సర్ది, దగ్గు, జ్వరాల బారిన పడి కొందరు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

News December 14, 2025

NZB: 1,476 పోలింగ్ కేంద్రాలు.. 61 వెబ్ క్యాస్టింగ్ కేంద్రాలు

image

నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఆదివారం రెండో విడుత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మొత్తం పోలింగ్ కేంద్రాలు-1,476, పీవోలు-1,476, ఓపీవోలు-1,937, సిబ్బంది తరలింపునకు రూట్లు-53, మైక్రో అబ్జర్వర్లు-56, జోనల్ అధికారులు-34, వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు-61ను సిద్ధం చేశారు. ఉదయం 7 గం. నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 2 గం. నుంచి ప్రారంభం అవుతుంది.

News December 14, 2025

NZB: 1,476 పోలింగ్ కేంద్రాలు.. 61 వెబ్ క్యాస్టింగ్ కేంద్రాలు

image

నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఆదివారం రెండో విడుత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మొత్తం పోలింగ్ కేంద్రాలు-1,476, పీవోలు-1,476, ఓపీవోలు-1,937, సిబ్బంది తరలింపునకు రూట్లు-53, మైక్రో అబ్జర్వర్లు-56, జోనల్ అధికారులు-34, వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు-61ను సిద్ధం చేశారు. ఉదయం 7 గం. నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 2 గం. నుంచి ప్రారంభం అవుతుంది.