News January 18, 2025
కామారెడ్డి: ‘బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలి’

బీసీలకు జనాభా ప్రాతిపాదికన అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని, జాతీయ బీసీ సంక్షేమ సంఘ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లో బీసీ మేధావుల సదస్సును నిర్వహించారు. రాజ్యాంగం ప్రకారం బీసీలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కృష్ణయ్య, బీసీ అధ్యాపకుల సంఘ అధ్యక్షుడు కాముని సుదర్శన్, జిల్లా బీసీ సంఘ అధ్యక్షుడు చింతల శంకర్ ఉన్నారు.
Similar News
News January 7, 2026
ఖమ్మం సీపీఐ సభకు CM రేవంత్

సీపీఐ శత వసంతాల ముగింపు వేడుకలకు ఖమ్మం వేదిక కానుంది. ఈనెల 18న స్థానిక ఎస్.ఆర్ & బీ.జీ.ఎన్.ఆర్ కళాశాల మైదానంలో జరగనున్న భారీ బహిరంగ సభకు CM రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ చారిత్రాత్మక సభలో సీఎం ప్రసంగించనున్నట్లు సీపీఐ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
News January 7, 2026
సంగారెడ్డి: పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే గడువును ప్రభుత్వం పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రూ.1000 అపరాధ రుసుముతో ఈనెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించవచ్చని సూచించారు.
News January 7, 2026
జనవరి 07: చరిత్రలో ఈరోజు

* 1935: కలకత్తాలో భారత జాతీయ సైన్సు అకాడమీని నెలకొల్పారు.
* 1938: నటి బి.సరోజాదేవి జననం
* 1950: సామాజిక సేవకురాలు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత శాంతా సిన్హా జననం
* 1967: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జననం (ఫోటోలో)
* 1979: బాలీవుడ్ నటి బిపాషా బసు పుట్టినరోజు
* 2008: జైపూర్ ఫుట్ (కృత్రిమ పాదం) సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ మరణం


