News January 28, 2025

కామారెడ్డి: భర్తను హత్య చేయించిన భార్య..!

image

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పల్పనూరు శివారులో లభ్యమైన <<15278298>>నారాయణ<<>> మృతదేహం మిస్టరీ వీడింది. హత్నూర పోలీసులు సోమవారం వివరాలు వెల్లడించారు. బిక్కనూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన నారాయణ భార్య లక్ష్మి నర్సవ్వ ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని ప్రియుడు, మరో ముగ్గురితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు. దీంతో ఆమెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News November 22, 2025

బాలికలకు సంతూర్ స్కాలర్‌‌షిప్.. రేపే లాస్ట్ డేట్

image

ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న గ్రామీణ పేద విద్యార్థినులకు విప్రో అందించే సంతూర్ ఉమెన్ స్కాలర్‌షిప్‌ అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. AP, మహారాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థినులు అర్హులు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. వీరికి 30వేల రూపాయలు అందుతుంది.
వెబ్‌సైట్: <>https://www.santoorscholarships.com/‌<<>>

News November 22, 2025

పాలమూరు: నేటి నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో 1, 3, 5 సెమిస్టర్ (రెగ్యూలర్, బ్యాక్‌లాగ్) డిగ్రీ పరీక్షలు నేటి (శనివారం) నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి సెమిస్టర్, మూడో సెమిస్టర్ విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఐదో సెమిస్టర్ విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

News November 22, 2025

జనగామ: ఆదర్శం.. ఈ విశ్రాంత ఉపాధ్యాయుడు!

image

ఉద్యోగ విరమణ పొందిన దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంకు చెందిన శ్రీరామ్ రాజయ్య తాను పదవీ విరమణ పొందిన పాఠశాలలోనే విరమణ లేని విశ్రాంత ఉపాధ్యాయుడిగా బోధిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో కడవెండి ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ ఉపాధ్యాయుడిగా విరమణ పొందారు. ఏడాది నుంచి అదే పాఠశాలలో ఉచితంగా పాఠాలు చెబుతున్న ఆయన్ను జనగామ అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ అభినందించారు.