News January 18, 2025

కామారెడ్డి: భూములను పరిశీలించి వివరాలు సమర్పించాలి: కలెక్టర్

image

సాగుకు యోగ్యంగా లేని భూములను పరిశీలించి వివరాలు సమర్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. క్యాసంపల్లి గ్రామంలోని 58 ఎకరాల భూములను శనివారం ఆయన పరిశీలించారు. ఇందులో 30 ఎకరాల భూమి లే ఔట్ వేశారని, మిగతా 28 ఎకరాలు పంట సాగులో ఉందని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. వెంట ఆర్డీవో రంగనాథ్ రావు, DAO తిరుమల ప్రసాద్ తదితరులు ఉన్నారు.

Similar News

News February 17, 2025

GBSపై ప్రజలకు అవగాహన కల్పించండి: మంత్రి

image

AP: GBS అంటు వ్యాధి కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి డోలా వీరాంజనేయస్వామి చెప్పారు. ఇవాళ గుంటూరులో జీజీహెచ్‌లో ఓ మహిళ GBSతో మరణించడంపై ఆయన స్పందించారు. ఈ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని, వ్యాధి <<15225307>>లక్షణాలు<<>> కనిపిస్తే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ప్రజారోగ్య సంరక్షణే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని తెలిపారు.

News February 17, 2025

మహబూబాబాద్: రేపు జిల్లా వ్యాప్తంగా సీపీఐ నిరసనలు: విజయ్ సారథి

image

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు అన్ని మండల కేంద్రాల్లో సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి విజయ సారధి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం బయ్యారంలో ఉక్కు పరిశ్రమను స్థాపించకుండా తాత్సారం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం పదేళ్లలో అమలు చేయడంలేదన్నారు.అందుకు రేపు జిల్లాలో నిరసనలు చేపడుతున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ నిరసనలో పాల్గొనాలన్నారు.

News February 17, 2025

MHBD: బీఆర్ఎస్ నాయకులకు మాజీ ఎంపీ కవిత సూచన 

image

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజును పురస్కరించుకొని బీఆర్ఎస్ కార్యాలయంలో వేడుకలను నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ మాలోతు కవిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేపు 17 సోమవారం రోజు పార్టీ కార్యాలయంలో జరిగే పుట్టినరోజు వేడుకల్లో కేసీఆర్ అభిమానులు, జిల్లా పార్టీ నాయకులు, పాల్గొనాలని కోరారు.

error: Content is protected !!