News February 24, 2025

కామారెడ్డి: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

image

పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.

Similar News

News February 26, 2026

MBNR: రాజకీయాలను కుదిపేస్తున్న కుమ్మెర ఘటన

image

కుమ్మెరలో మల్లన్న జాతర సందర్భంగా తలెత్తిన వివాదం రెండు కులాల మధ్య పంచాయితీగా మారింది. తన రెండు నెలల కుమార్తెను రెడ్డి కులానికి చెందిన వ్యక్తులు కాలితో తన్నడంతో చనిపోయిందని రజక కులానికి చెందిన చిలికేశ్వరం గణేశ్, మౌనిక దంపతులు ఆరోపిస్తున్నారు. రజక కులానికి చెందిన కుటుంబంపై రెడ్డి కులానికి చెందిన వ్యక్తులు చేసిన దాడిలో 2 నెలల పసికందు చనిపోయిందనే వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది.

News February 26, 2026

సరైన నిద్రలేకపోతే అందానికి దెబ్బ

image

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ నిద్రలేమి వేధిస్తోంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు వస్తాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇది అందాన్నీ దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్రలేకపోతే శరీరం పీహెచ్ దెబ్బతిని చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. దీంతో వయసు పైబడినట్లు కనిపిస్తారు. అలాగే డార్క్ సర్కిల్స్, కళ్ల వాపు, ముడతలు, జుట్టు రాలిపోవడం వంటివి కూడా వస్తాయని చెబుతున్నారు.

News February 26, 2026

నిర్మల్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు సర్వం సిద్ధం

image

జిల్లాలో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DIEO) పరుశురాం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 6,473 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, వారి కోసం 23 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని వివరించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.