News August 2, 2024

కామారెడ్డి: మహిళను హత్య చేసిన ఘటనలో వ్యక్తి అరెస్ట్

image

ఇటీవల ఓ వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసినట్లు నిందితుడు మాధవ్ అంగీకరించడంతో అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉమా భర్త అశోక్‌తో మూడేళ్ల క్రితమే విడిపోయింది. దీంతో పంచముఖి కాలనీలో అద్దె ఇంట్లో ఉమా, మాధవ్ సహజీవనం చేస్తున్నారు. తనతో గొడవ పడిందని, ఆమె మెడకు చున్నీ బిగించి, గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నారని చెప్పారు.

Similar News

News November 7, 2025

MP అర్వింద్ ధర్మపురి ఘాటు వ్యాఖ్యలు

image

గత BRS ప్రభుత్వంపై నిజామాబాద్ MPఅర్వింద్ ధర్మపురి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ KCR తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని ఆరోపించారు. KCR కుటుంబం చేసిన పాపానికి CM రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ చేస్తున్న అతిపెద్ద పాపమని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ పాపం రేవంత్ రెడ్డికి కచ్చితంగా చుట్టుకుంటుందని పేర్కొన్నారు.

News November 7, 2025

NZB: ఐడీఓసీలో “వందేమాతరం” గేయాలాపన

image

“వందేమాతరం” జాతీయ గేయాన్ని రచయిత బంకిమ్‌ చంద్ర ఛటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వందేమాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తి భావాన్ని చాటిచెప్పారు.

News November 7, 2025

NZB: న్యూసెన్స్ చేస్తున్న ముగ్గురు మహిళలకు జైలు శిక్ష: SHO

image

న్యూసెన్స్ చేస్తున్న ముగ్గురు మహిళలకు జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి గురువారం తీర్పు చెప్పారని వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతంలో బుధవారం రాత్రి ముగ్గురు మహిళలు అసభ్యంగా ప్రవర్తిస్తూ పబ్లిక్‌లో న్యూసెన్స్ చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి గురువారం కోర్టులో హాజరు పరచగా 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.