News March 24, 2025

కామారెడ్డి: మాదకద్రవ్యాల నిర్మూలనకు నార్కోటిక్స్ సమావేశం

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జిల్లా నార్కోటిక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాల వినియోగ నిర్మూలన కోసం వైద్య ఆరోగ్య, పోలీసు, విద్యా, స్త్రీ, శిశు సంక్షేమ తదితర శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళిక తయారు చేశారు. SP రాజేశ్ చంద్ర, ASP చైతన్య రెడ్డి, DMHO డా.చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Similar News

News September 16, 2025

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

image

TG: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య‌పై ఎఫ్ఐఆర్‌ను 2016లో హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ దీనిపై CJI జస్టిస్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. సెప్టెంబర్ 22న తదుపరి విచారణ చేస్తామని వెల్లడించింది.

News September 16, 2025

కిక్ బాక్సింగ్ పోటీల్లో సిరిసిల్ల విద్యార్థులకు వెండి పతకాలు

image

అస్మిత మహిళ కిక్ బాక్సింగ్ ఉమెన్స్ లీగ్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన ఇద్దరు విద్యార్థులు రెండు వెండి పతకాలు సాధించారు. ఆదివారం వరంగల్ మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ కిక్ బాక్సింగ్ లీగ్లో జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులు పాల్గొనగా ఓల్డర్ కెడిట్- 37kgs point fight విభాగంలో శ్లోక, 42kgs point fight విభాగంలో లక్ష్మిప్రసన్న వెండి పతకాలు కొల్లగొట్టారు.

News September 16, 2025

GWL: స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ఠ భద్రత ఉండాలి- కలెక్టర్

image

ఎన్నికల సామగ్రి భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ఠ భద్రత ఉండాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం వివిధ రాజకీయ పార్టీల నేతలతో కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ పరిశీలించారు. అక్కడ ఈవీఎంలకు సంబంధించిన రికార్డులు, సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షణ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశం మేరకు పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. స్థానిక తహశీల్దార్ మల్లికార్జున్ పాల్గొన్నారు.