News January 17, 2025

కామారెడ్డి: మార్కెట్‌లో MLA 

image

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ గ్రామ వారాంతపు సంతలో శుక్రవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పర్యటించారు. సంతలో కూరగాయలు విక్రయించడానికి వచ్చిన రైతులు, వ్యాపారులతో ఎమ్మెల్యే ముచ్చటించారు. వారి దగ్గర కూరగాయలు కొనుగోలు చేసి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఒక సామాన్యుడిలా సంతలో పర్యటించి తమ సమస్యలు తెలుసుకుని కూరగాయలు కొనుగోలు చేయడంపై రైతులు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు.

Similar News

News November 11, 2025

ఆత్మాహుతి దాడే! బలం చేకూరుస్తున్న ఆధారాలు

image

DL: ఎర్రకోట వద్ద కారు పేలుడు ఆత్మాహుతి దాడి అనేలా ఆధారాలు లభిస్తున్నాయి. i20 కారులో ఫ్యూయల్, అమ్మోనియం నైట్రేట్, డిటోనేటర్లను దుండగుడు తీసుకొచ్చినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అటు హరియాణా రిజిస్టర్డ్ కారును కశ్మీర్ వాసి తారిఖ్ కొన్నాక పలువురి నుంచి నిన్న డ్రైవ్ చేసిన Dr.ఉమర్‌కు చేరింది. JK పోలీసులు UP ఫరీదాబాద్‌లో నిన్న అరెస్టు చేసిన ఉగ్రవాద అనుమానితులతో ఇతడికి కాంటాక్ట్స్ ఉన్నట్లు సమాచారం.

News November 11, 2025

భీమవరం: ‘మా అమ్మ, తమ్ముడు దెయ్యాలు’.. నిందితుడి వీడియో వైరల్

image

భీమవరంలో తల్లి, తమ్ముడిని దారుణంగా గంట పాటు <<18246456>>పొడిచి చంపిన<<>> తర్వాత శ్రీనివాస్ రోడ్డుపైకి వచ్చి మాట్లాడిన మాటలు భయబ్రాంతులకు గురి చేశాయి. ‘మా అమ్మ, తమ్ముడు మనుషులు కాదు దెయ్యాలు. నన్ను పీక్కుతింటున్నారు. వాళ్ల కడుపులో ఎన్నిసార్లు పొడిచినా చావట్లేదు. నా మనసులో ఏం అనుకున్నా వాళ్లకు తెలిసిపోతోంది. నాకు పిచ్చి అంటున్నారు’ అని చెప్పడం భయం కలిగించింది. కాగా అతని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తేల్చారు.

News November 11, 2025

నాయుడుపేట సెజ్‌లో రూ.3,038 కోట్ల పెట్టుబడి.. 2,265 మందికి జాబ్స్

image

మంత్రివర్గ సమావేశంలో CM చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో నాయుడుపేట సెజ్‌లో పలు కంపెనీలు పెట్టుబడి పెట్టనున్నాయి. ఏపీటోమ్‌ కాంపోనెంట్స్‌ రూ.700 కోట్ల పెట్టుబడితో PCBలు, ఎలక్ట్రానిక్స్‌ కాంపోనెంట్స్‌ తయారీ యూనిట్‌‌ను ఏర్పాటు చేయనుంది. వాల్ట్సన్‌ LABS రూ.1,743 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. గ్రీన్‌లామ్‌ సౌత్‌ లిమిటెడ్‌ రూ.595 కోట్లతో యూనిట్‌ ఏర్పాటు చేయనుంది.