News September 14, 2024
కామారెడ్డి: ముమ్మరంగా గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ పట్టణంలోని శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయ సమీపంలో గల శాఖరి కుంటలో కార్యదర్శి మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలు సులువుగా వెళ్లేందుకు రహదారిని చదును చేసి, విద్యుత్ దీపాలను అమర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయితీ కార్యనిర్వహణ అధికారి మహేశ్ గౌడ్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News December 18, 2025
మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి: సీపీ

“రాజీ మార్గమే – రాజ మార్గం” అనే నినాదంతో ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీ పి. సాయి చైతన్య పిలుపునిచ్చారు. కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ఇదొక సువర్ణావకాశమని ఆయన పేర్కొన్నారు. రాజీ పడదగ్గ నేరాలు, సివిల్ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం వల్ల సమయం, ధనం ఆదా అవుతాయని ఆయన సూచించారు.
News December 18, 2025
నిజామాబాద్: శాంతియుతంగా పూర్తి: సీపీ

ప్రజల సంపూర్ణ సహకారంతో గ్రామ పంచాయితీ ఎన్నికలు శాంతియుతంగా పూర్తయ్యాయని సీపీ సాయి చైతన్య తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి డిసెంబర్ 17 వరకు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో అన్ని స్థాయిల పోలీసు సిబ్బంది అంకితభావంతో కృషి చేశారని వెల్లడించారు. ప్రజలు-పోలీసుల మధ్య ఉన్న సమన్వయమే ఈ విజయానికి ప్రధాన కారణమన్నారు.
News December 18, 2025
NZB: BJP సర్పంచ్లు ఎంతమంది గెలిచారంటే!

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 84 మంది సర్పంచులు BJP తరఫున గెలుపొందారు. పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 34 మండలాలు, 642 గ్రామ పంచాయతీల్లో BJP మద్దతుదారులు 299 GPల్లో పోటీ చేసి 84 గ్రామ పంచాయతీల్లో గెలిచారు. ఎంపీ అర్వింద్ తమకు అండదండలు ఇవ్వడంతో పాటు గ్రామస్థులు మద్దతు పలికారని గెలిచిన వారన్నారు.


