News January 25, 2025

కామారెడ్డి: రిపబ్లిక్ డే పరేడ్‌కు ప్రభుత్వ కళాశాల విద్యార్థి

image

కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ధరావత్ మౌనిక ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్సీసీ అధికారి లెఫ్ట్నెంట్ డాక్టర్ ఏ.సుధాకర్‌ను ప్రిన్సిపల్ ప్రత్యేకంగా అభినందించారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ప్రతి సంవత్సరం కళాశాల విద్యార్థులు ఎంపిక అవుతున్నారన్నారు.

Similar News

News November 9, 2025

మైనార్టీ వెల్ఫేర్ డే కు ఏర్పాట్లు పూర్తి: VZM కలెక్టర్

image

జనాబ్‌ మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ జన్మదినం సందర్భంగా రేపు విజయనగరం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు మైనారిటీ వెల్ఫేర్ డే & జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రాంసుందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాలకు చెందిన ప్రముఖులు, అధికారులు పాల్గొంటారన్నారు.

News November 9, 2025

ములుగు: Way2Newsలో వరుస కథనాలు.. స్పందించిన సీతక్క

image

ములుగు(D) కన్నాయిగూడెంలో <<18239952>>పాముకాటుతో బాలుడు<<>> హరినాద్ స్వామి(7) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై Way2News ప్రచురించిన వరుస కథనాలకు మంత్రి సీతక్క స్పందించారు. వైద్యం అందక బాలుడు మృతి చెందినట్లు బంధువుల ఆరోపణతో వైద్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మృతికి కారణమైన వైద్యుడిని వెంటనే సస్పెండ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో వైద్యులతో పాటు, అన్ని రకాల మందులు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

News November 9, 2025

NIEPVDలో ఉద్యోగాలు

image

డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజ్యువల్ డిజబిలిటిస్ (<>NIEPVD<<>>) 14 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 28లోపు అప్లై చేసుకోవచ్చు. వీటిలో లెక్చరర్, ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 56ఏళ్లు. లెక్చరర్లకు నెలకు జీతం రూ.60వేలు, ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.45వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: niepvd.nic.in