News April 6, 2025
కామారెడ్డి: రేపు కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్లు ప్రారంభం

కామారెడ్డి జిల్లాలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్లను సోమవారం ప్రారంభించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 18 కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, వాటిని ఫార్చునర్ ద్వారా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజన్ పౌల్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జిల్లా పోలీస్ శాఖ ద్వారా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Similar News
News November 7, 2025
దక్షిణ మధ్య రైల్వేలో 61 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 7, 2025
వందేమాతరాన్ని ఆలపించిన నెల్లూరు కలెక్టర్

స్వాతంత్య్ర సంగ్రామంలో భారతీయులను ఏకతాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన దేశభక్తి గేయం వందేమాతరం అని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా కొనియాడారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్లో వందేమాతరం గేయాన్ని శుక్రవారం ఉదయం ఆలపించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వందేమాతరం గేయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.
News November 7, 2025
తరచూ ఛాతి ఎక్స్రేలు తీయించుకుంటున్నారా?

చాలామంది వార్షిక హెల్త్ చెకప్స్లో రక్త పరీక్షలతో పాటు ఎక్స్రేలు చేయించుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండి, ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వ్యక్తులు చెస్ట్ ఎక్స్-రేలు తీసుకోనక్కర్లేదని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఎక్స్-రేలు తరచూ తీయించుకుంటే రేడియేషన్కు గురవుతారు. ఇది దీర్ఘకాలంలో సమస్యలకు దారితీయవచ్చు. దగ్గు, జ్వరం, టీబీ వంటి అనారోగ్యం బారిన పడినవారు వైద్యుల సూచనతో తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.


