News January 31, 2025
కామారెడ్డి: రైల్వే స్టేషన్ను సందర్శించిన డీఆర్ఎం

కామారెడ్డి రైల్వే స్టేషన్ను రైల్వే శాఖ డీఆర్ఎం లోకేష్ శుక్రవారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. రైల్వే స్టేషన్ ముందు నూతనంగా ఏర్పాటు చేసిన ముఖద్వారాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ప్లాట్ ఫాంపై ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా షెడ్లు నిర్మించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
Similar News
News December 2, 2025
ఎన్నికల ఖర్చులకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడో విడతలో నామినేషన్ వేయాలనుకునే వారు ముందుగానే కొత్త అకౌంట్ తీసుకుంటే నామినేషన్ ప్రక్రియ సులభమవుతుందని కలెక్టర్ సూచించారు.
News December 2, 2025
‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<


