News January 31, 2025
కామారెడ్డి: రైల్వే స్టేషన్ను సందర్శించిన డీఆర్ఎం

కామారెడ్డి రైల్వే స్టేషన్ను రైల్వే శాఖ డీఆర్ఎం లోకేష్ శుక్రవారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. రైల్వే స్టేషన్ ముందు నూతనంగా ఏర్పాటు చేసిన ముఖద్వారాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ప్లాట్ ఫాంపై ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా షెడ్లు నిర్మించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
Similar News
News November 18, 2025
వందల మంది మృతికి హిడ్మానే కారణం!

దండకారణ్యంలో బలగాల్ని నడిపించే వ్యూహకర్తగా గుర్తింపు పొందిన హిడ్మా.. కేంద్ర బలగాలపై మెరుపుదాడుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. PLGA 1వ బెటాలియన్కు నాయకత్వం వహిస్తూ, కేంద్ర కమిటీలో చిన్న వయస్కుడిగా ఎదిగాడు. పలు దాడుల్లో కీలకపాత్ర పోషించాడు.
*2010 దంతెవాడ దాడిలో 76 మంది CRPF జవాన్లు మృతి
*2013 జిరామ్ ఘాట్లో కాంగ్రెస్ నేతలతో సహా 27 మంది మృతి
*2021 సుక్మా-బీజాపూర్లో 22 మంది భద్రతా సిబ్బంది మృతి
News November 18, 2025
వందల మంది మృతికి హిడ్మానే కారణం!

దండకారణ్యంలో బలగాల్ని నడిపించే వ్యూహకర్తగా గుర్తింపు పొందిన హిడ్మా.. కేంద్ర బలగాలపై మెరుపుదాడుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. PLGA 1వ బెటాలియన్కు నాయకత్వం వహిస్తూ, కేంద్ర కమిటీలో చిన్న వయస్కుడిగా ఎదిగాడు. పలు దాడుల్లో కీలకపాత్ర పోషించాడు.
*2010 దంతెవాడ దాడిలో 76 మంది CRPF జవాన్లు మృతి
*2013 జిరామ్ ఘాట్లో కాంగ్రెస్ నేతలతో సహా 27 మంది మృతి
*2021 సుక్మా-బీజాపూర్లో 22 మంది భద్రతా సిబ్బంది మృతి
News November 18, 2025
తుమ్మలను BRS వదులుకోవడం పెద్ద తప్పు: కవిత

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని, తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ నాయకుడిని దూరం చేసుకోవడం పెద్ద తప్పని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. పార్టీలో తనపై కుట్ర చేసి బయటకు పంపారని ఆరోపించారు. ఉద్యమ నాయకులను కూడా ఇబ్బందులు పెట్టారని, కాలమే అన్నింటికి సమాధానం చెబుతుందన్నారు. తాను వెళ్తున్న ప్రతి ప్రాంతానికి బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారని ఆమె తెలిపారు.


