News January 28, 2025
కామారెడ్డి: ‘రోడ్డు నిబంధనలు పాటించాలి’

ప్రతి ఒకరూ రోడ్డు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలన్నారు. ఎంతోమంది హెల్మెట్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
Similar News
News December 8, 2025
నిజామాబాద్: సర్పంచి పీఠం కోసం అభ్యర్థుల తంటాలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్థానిక ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా సర్పంచి స్థానాలకు ఎక్కువ మంది పోటీలో ఉండటంతో, ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరోవైపు, ప్రచారంలో ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు ఎవరి వైపు మొగ్గుచూపుతారోనని అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
News December 8, 2025
పాడి రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి

రోజుకు రెండు లీటర్లు పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు.. రోజుకు 10 లీటర్లు పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుందని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70 శాతం వ్యయం దాణా, గడ్డి, మందులకే ఖర్చవుతుంది. పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే పాడి పశువుల మేపుపై అదుపు, సంకరజాతి పశువుల పోషణపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
News December 8, 2025
ఖమ్మం: పల్లె రాజకీయాల్లో మాటల సెగలు

మూడు దశల పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పల్లె రాజకీయాలు వేడెక్కాయి. అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించగా, ప్రధాన పార్టీల అగ్రనేతలు సైతం రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీల నేతల మధ్య మాటల ఫిరంగులు పేలుతుండటంతో చలికాలంలోనూ రాజకీయ వాతావరణం సెగలు కక్కుతోంది. కార్యకర్తలను గెలిపించుకునేందుకు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.


