News December 24, 2024
కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి

రాయదుర్గం PS పరిధిలో శివాని అనే యువతి సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. CBITలో బీటెక్ 4వ ఏడాది చదువుతున్న శివాని KMR జిల్లా నిజాంసాగర్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి వచ్చింది. హాస్టల్కు వెళ్లేందుకు స్నేహితుడు వెంకట్ రెడ్డి బైక్ పై ఎక్కి నార్సింగి సర్వీస్ రోడ్డులో వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో శివాని మృతిచెందగా వెంకట్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News December 19, 2025
NZB: ఆదివారం కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు: TPCC చీఫ్

జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరు ను తొలగించి వికసిత్ భారత్ జి.రామ్.జి పేరు తో కొత్త పథకాన్ని తెస్తూ BJP చేస్తున్న కుట్రలను నిరసిస్తూ AICC పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్యాడర్ కు పిలుపునిచ్చారు. జిల్లాలో ఆదివారం కార్యకర్తలు, నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.
News December 19, 2025
NZB: రేషన్ కార్డు… E-KYCపూర్తి చేసుకోండి: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలోని రేషన్ కార్డుదారులు తమ వేలిముద్ర సహాయంతో E-KYC పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ (పౌరసరఫరాలు) ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో మొత్తం 467295 కార్డుల్లోని 1572176 మంది లబ్దిదారులకు గాను 1103928 (70.22%) లబ్దిదారులు మాత్రమే E-KYC పూర్తిచేసుకున్నారని, మిగతా 468251 (29.78%) లబ్దిదారులు సమీపంలోని తమ రేషన్ షాప్ కు వెళ్లిE-KYC పూర్తిచేసుకోవాలన్నారు.
News December 19, 2025
NZB: కానిస్టేబుల్ ప్రమోద్ భార్యకు రూ. కోటి చెక్కు

ఇటీవల విధి నిర్వహణలో మృతి చెందిన CCSకానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ. కోటి చెక్కును పోలీస్ కమీషనర్ సాయి చైతన్య అందించారు. పోలీస్ సాలరీ ప్యాకేజ్ వర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ క్లెయిమ్ రూపంలో పోలీస్ సాలరీ ప్యాకేజ్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ క్లెయిమ్ రూపంలో ఈ చెక్ వచ్చింది. ఈ కార్యక్రమంలో ACP రాజా వెంకట్ రెడ్డి, SBI అధికారులు రవి కిరణ్, మహేశ్వర్ పాల్గొన్నారు.


